AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel Tariff: ఎయిర్ టెల్ టారిఫ్ పెంచబోతోందా? క్లారిటీ ఇచ్చిన ఛైర్మన్ సునీల్ మిట్టల్

Telecom Mobile Tariff: చివరగా 2019 డిసెంబరులో దేశంలోని మూడు అతిపెద్ద టెలికాం సంస్థలైన భారతి ఎయిర్‌టెల్(Bharti Airtel), రియలన్స్ జియో(Reliance Jio), వొడాఫోన్ ఐడియా(Vi) టారిఫ్‌లు పెంచాయి.

Airtel Tariff: ఎయిర్ టెల్ టారిఫ్ పెంచబోతోందా? క్లారిటీ ఇచ్చిన ఛైర్మన్ సునీల్ మిట్టల్
Airtel Tariff Hike
Janardhan Veluru
|

Updated on: Jul 02, 2021 | 12:06 PM

Share

Airtel Tariff: మొబైల్ రీఛార్జ్ టారిఫ్‌లను పెంచేందుకు దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదిన్నర కాలానికి పైగా మొబైల్ టారిఫ్‌లను పెంచలేదు. చివరగా 2019 డిసెంబరులో దేశంలోని మూడు అతిపెద్ద టెలికాం సంస్థలైన భారతి ఎయిర్‌టెల్(Bharti Airtel), రియలన్స్ జియో(Reliance Jio), వొడాఫోన్ ఐడియా(Vi) టారిఫ్‌లు పెంచాయి. టెలికాం రంగంలో ప్రస్తుతం నెలకొన్న ఒత్తిడిని అధిగమించేందుకు టారిఫ్‌లు పెంచాలని ఎయిర్ టెల్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది వరకే పలు సందర్భాల్లో టారిఫ్‌లను పెంచాల్సిన అవసరముందని ఎయిర్ టెల్ అభిప్రాయపడింది. అయితే ఎయిర్ టెల్ ఏకపక్షంగా టారిఫ్‌లు పెంచేందుకు సిద్ధంగా లేదని, ఇతర టెలికాం కంపెనీలు కూడా కలిసిరావాలని కోరుతోంది. తాజాగా టారిఫ్‌ల పెంపుపై భారతి ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ క్లారిటీ ఇచ్చారు. ఇతర టెలికాం కంపెనీలు కూడా కలిసొస్తే టారిఫ్‌లను పెంచేందుకు తాము వెనుకాడబోమని ఆయన స్పష్టంచేశారు.

అయితే ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయాలను తీసుకోలేమని సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. టారిఫ్‌లను భారీగా పెంచాలని తాము భావించడం లేదన్నారు. అయితే టెలికాం మార్కెట్‌ తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొంత మేర ఛార్జీలను పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మిగిలిన టెలికాం సంస్థలు కూడా టారిఫ్‌లు పెంచేందుకు తమతో కలిసి రావాలని ఆయన కోరారు.

Airtel Bharati Chairman Sunil Mittal

Airtel Bharati Chairman Sunil Mittal

టారిఫ్‌ల పెంపు సాధ్యమేనా?

టారిఫ్‌లు పెంచేందుకు ఎయిర్ టెల్ ఉవ్విళ్లూరుతున్నా…ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యంకాకపోవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రియలన్స్ జియో, గూగుల్‌తో కలిసి ప్రపంచంలో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. సెప్టెంబర్ 10న ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు ఇటీవల జరిగిన రిలయన్స్ ఏజీఎంలో ఆ సంస్థ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి వస్తే దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల మధ్య పోటీ మరింత తారస్థాయికి చేరే అవకాశముంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా దేశంలో తన కస్టమర్ల సంఖ్యను మరింత పెంచుకోవాలని రిలయన్స్ జియో భావిస్తోంది. ఈ తరుణంలో టారిఫ్‌లను పెంచేందుకు రిలయన్స్ జియో సముఖత వ్యక్తంచేసే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read..

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.

ఇలాంటి చికెన్ ప్రియుడ్ని మీ జీవితంలో చూసి ఉండరు..! దొంగలు పడ్డా అలాగే..

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..