AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel Tariff: ఎయిర్ టెల్ టారిఫ్ పెంచబోతోందా? క్లారిటీ ఇచ్చిన ఛైర్మన్ సునీల్ మిట్టల్

Telecom Mobile Tariff: చివరగా 2019 డిసెంబరులో దేశంలోని మూడు అతిపెద్ద టెలికాం సంస్థలైన భారతి ఎయిర్‌టెల్(Bharti Airtel), రియలన్స్ జియో(Reliance Jio), వొడాఫోన్ ఐడియా(Vi) టారిఫ్‌లు పెంచాయి.

Airtel Tariff: ఎయిర్ టెల్ టారిఫ్ పెంచబోతోందా? క్లారిటీ ఇచ్చిన ఛైర్మన్ సునీల్ మిట్టల్
Airtel Tariff Hike
Janardhan Veluru
|

Updated on: Jul 02, 2021 | 12:06 PM

Share

Airtel Tariff: మొబైల్ రీఛార్జ్ టారిఫ్‌లను పెంచేందుకు దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదిన్నర కాలానికి పైగా మొబైల్ టారిఫ్‌లను పెంచలేదు. చివరగా 2019 డిసెంబరులో దేశంలోని మూడు అతిపెద్ద టెలికాం సంస్థలైన భారతి ఎయిర్‌టెల్(Bharti Airtel), రియలన్స్ జియో(Reliance Jio), వొడాఫోన్ ఐడియా(Vi) టారిఫ్‌లు పెంచాయి. టెలికాం రంగంలో ప్రస్తుతం నెలకొన్న ఒత్తిడిని అధిగమించేందుకు టారిఫ్‌లు పెంచాలని ఎయిర్ టెల్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది వరకే పలు సందర్భాల్లో టారిఫ్‌లను పెంచాల్సిన అవసరముందని ఎయిర్ టెల్ అభిప్రాయపడింది. అయితే ఎయిర్ టెల్ ఏకపక్షంగా టారిఫ్‌లు పెంచేందుకు సిద్ధంగా లేదని, ఇతర టెలికాం కంపెనీలు కూడా కలిసిరావాలని కోరుతోంది. తాజాగా టారిఫ్‌ల పెంపుపై భారతి ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ క్లారిటీ ఇచ్చారు. ఇతర టెలికాం కంపెనీలు కూడా కలిసొస్తే టారిఫ్‌లను పెంచేందుకు తాము వెనుకాడబోమని ఆయన స్పష్టంచేశారు.

అయితే ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయాలను తీసుకోలేమని సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. టారిఫ్‌లను భారీగా పెంచాలని తాము భావించడం లేదన్నారు. అయితే టెలికాం మార్కెట్‌ తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొంత మేర ఛార్జీలను పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మిగిలిన టెలికాం సంస్థలు కూడా టారిఫ్‌లు పెంచేందుకు తమతో కలిసి రావాలని ఆయన కోరారు.

Airtel Bharati Chairman Sunil Mittal

Airtel Bharati Chairman Sunil Mittal

టారిఫ్‌ల పెంపు సాధ్యమేనా?

టారిఫ్‌లు పెంచేందుకు ఎయిర్ టెల్ ఉవ్విళ్లూరుతున్నా…ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యంకాకపోవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రియలన్స్ జియో, గూగుల్‌తో కలిసి ప్రపంచంలో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. సెప్టెంబర్ 10న ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు ఇటీవల జరిగిన రిలయన్స్ ఏజీఎంలో ఆ సంస్థ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి వస్తే దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల మధ్య పోటీ మరింత తారస్థాయికి చేరే అవకాశముంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా దేశంలో తన కస్టమర్ల సంఖ్యను మరింత పెంచుకోవాలని రిలయన్స్ జియో భావిస్తోంది. ఈ తరుణంలో టారిఫ్‌లను పెంచేందుకు రిలయన్స్ జియో సముఖత వ్యక్తంచేసే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read..

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.

ఇలాంటి చికెన్ ప్రియుడ్ని మీ జీవితంలో చూసి ఉండరు..! దొంగలు పడ్డా అలాగే..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ