AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lily Flower: లిల్లీ ఫ్లవర్ సాగుతో అధిక సంపాదన.. తక్కువ ఖర్చు అధిక రాబడి..

Lily Flower: భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డెకరేషన్ పువ్వుల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దేశంలో పూల వ్యవసాయం చేస్తున్న రైతులకి

Lily Flower: లిల్లీ ఫ్లవర్ సాగుతో అధిక సంపాదన.. తక్కువ ఖర్చు అధిక రాబడి..
Lily Flower Farming
uppula Raju
|

Updated on: Jan 20, 2022 | 8:31 PM

Share

Lily Flower: భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డెకరేషన్ పువ్వుల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దేశంలో పూల వ్యవసాయం చేస్తున్న రైతులకి ఇదొక మంచి అవకాశం అనే చెప్పాలి. ఈ పూలు చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా రైతులు కూడా భారీగా సంపాదిస్తున్నారు. అలాంటి ఒక పువ్వు లిల్లీ. ఇది ఒక అన్యదేశ డెకరేషన్‌ పువ్వు. అనేక రంగులలో ఉంటుంది. భారతదేశంలోని రైతులు దీనిని సాగు చేయడం ద్వారా అధిక ఆదాయం సంపాదిస్తున్నారు.

లిల్లీ ఒక అన్యదేశ పువ్వు అయినప్పటికీ ఇది భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. పాలీ హౌస్‌లో రైతులు ఏడాది పొడవునా ఉత్పత్తి చేస్తున్నారు. దీని వాణిజ్య సాగు మన దేశంలో చాలా తక్కువ పరిమాణంలో జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల రైతులు మాత్రమే లిల్లీ పువ్వులు పండిస్తున్నారు. ఇది కాకుండా మహారాష్ట్రలో కూడా కొంతమంది సాగు చేస్తున్నారు. లిల్లీ సాగు మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కణజాల సంస్కృతి ప్రక్రియ ద్వారా నర్సరీని సిద్ధం చేస్తారు. ఈ పని పెద్ద ప్రయోగశాలలు లేదా కంపెనీలలో జరుగుతుంది. రెండో దశలో నర్సరీ అంటే మొక్కలు నాటుతారు. మొక్కలు పుష్పాలను ఉత్పత్తి చేయవు దుంపలను ఉత్పత్తి చేస్తాయి. మూడో దశలో ఆ దుంపలను కుండీలలో నాటుతారు. దీంతో రైతులకు పూలు లభిస్తాయి.

కొండ రాష్ట్రాలలోని వాతావరణం లిల్లీలకు అనుకూలంగా ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో నివసించే రైతులు బహిరంగ ప్రదేశంలో లిల్లీస్ సాగు చేయవచ్చు. మైదాన ప్రాంతాల్లో లిల్లీల పెంపకానికి పాలీ హౌస్ అవసరం. పాలీ హౌస్‌లో నాటు వేయాలంటే 2.5 కిలోల కోకోపీట్, 2.5 కిలోల వానపాముల ఎరువు, 2.5 కిలోల గడ్డి, 5 కిలోల బొగ్గు బూడిద అవసరం. దీని తర్వాత ఈ మిశ్రమంలో మొక్కలు నాటడం వల్ల రైతులకు దుంపలు అందుతాయి. దుంప అభివృద్ధి చెందడానికి మూడు నెలలు పడుతుంది. ఈ సమయంలో మంచి సంరక్షణ అవసరం. బిందు సేద్యం చేస్తే చాలా మంచిది.

రైతులు కోరుకుంటే దుంపలను అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. లేదంటే పువ్వులు పెంచడం ద్వారా నేరుగా విక్రయించవచ్చు. మూడు-మూడు దుంపలను కుండీలలో నాటుతారు. నీటిని పిచికారీ చేయడం అవసరం. 7 రోజుల తర్వాత, పాలీ హౌస్ ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల వద్ద స్థిరీకరించడం మంచిది. నాటిన 30 రోజుల తర్వాత ఆకుపచ్చ మొగ్గ కనిపిస్తుంది వెంటనే పువ్వులు వికసిస్తాయి. భారతదేశంలో లిల్లీ సాగు చాలా తక్కువ పరిమాణంలో జరుగుతోంది. దీనివల్ల కంపెనీలు ముందుగానే రైతులతో ఒప్పందాలు చేసుకుంటాయి. దీని వల్ల రైతులకు లాభమేమిటంటే మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.

Pregnancy: గర్భధారణ సమయంలో మహిళల పాదాలలో వాపు ఉంటుంది.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?

హెచ్చరిక.. కరోనా మందులు ఏ పరిస్థితిలో వాడాలో తెలుసుకోండి.. లేదంటే దుష్పరిణామాలు..?

Eyes: కళ్ల మంటలు, దురదలు ఇలా చేస్తే మటుమాయం.. ఆస్పత్రి అవసరమే ఉండదు..?