AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Data: మొబైల్ డేటా వినియోగంలో దూసుకెళ్తున్న భారత్.. స్మార్ట్‌ఫోన్లు పెరగడమే కారణమా..

దేశంలో స్మార్ట్‎ఫోన్లు వినియోగం పెరుగుతోంది. టెలికామ్ కంపెనీలు తక్కువ ధరకు డేటాను అందించడంతో ఇంటర్నెట్‎ను విరివిగా వాడుతున్నారు. దేశంలో ప్రతి త్రైమాసికంలో 25 మిలియన్ల కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పెరుగుతున్నారు...

Mobile Data: మొబైల్ డేటా వినియోగంలో దూసుకెళ్తున్న భారత్.. స్మార్ట్‌ఫోన్లు పెరగడమే కారణమా..
Data
Srinivas Chekkilla
|

Updated on: Oct 23, 2021 | 9:41 PM

Share

దేశంలో స్మార్ట్‎ఫోన్లు వినియోగం పెరుగుతోంది. టెలికామ్ కంపెనీలు తక్కువ ధరకు డేటాను అందించడంతో ఇంటర్నెట్‎ను విరివిగా వాడుతున్నారు. దేశంలో ప్రతి త్రైమాసికంలో 25 మిలియన్ల కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పెరుగుతున్నారు. దేశంలో మొబైల్ డేటా వినియోగం రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్‌ శర్మ తెలిపారు. దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారులు ఒక్కొక్కరు నెలకు 12 జీబీ చొప్పున వాడుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 1.18 బిలియన్ మొబైల్ కనెక్షన్లు, 700 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు, 600 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయని తెలిపారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో శర్మ ప్రసంగించారు.

గత 6-7 సంవత్సరాల్లో అపారమైన పురోగతిని చూశామని చెప్పారు. ప్రధానమంత్రి ఊహించిన డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లకు అనుకూలంగా ఉందన్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), ఆధార్, కోవిన్ ఇప్పటికే ప్రజల జీవితాలను మార్చాయని తెలిపారు. జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1978-బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి అయిన శర్మ గతంలో ట్రాయ్ ఛైర్మన్‌గా పని చేశారు. దేశంలో ఫైబర్ ఆధారిత నెట్‌వర్క్‌ల విస్తరణ ద్వారా కనెక్టివిటీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చాలావరకు టెలికాం ఆపరేటర్లు 4జీ నెట్‌వర్క్‌లకు మారిన నేపథ్యంలో.. స్థానికంగా కొత్త డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు.

దేశంలో డేటా రేట్లు చౌకగా ఉన్నందున ప్రజలు వీడియో కాల్స్, సినిమాలు చూస్తున్నారని శర్మ తెలిపారు. సెప్టెంబర్ 2016 లో ప్యూర్‌ప్లే 4G ఆపరేటర్ రిలయన్స్ జియో రాకతో టెలికాం రంగంలో మార్పును వచ్చిందని.. సమర్థవంతమైన డేటా టారిఫ్‌కు దారితీసిందని పేర్కొన్నారు. 2025 నాటికి భారతదేశంలో ప్రతి వ్యక్తికి డేటా వినియోగం దాదాపు 25 జీబీకి రెట్టింపు అవుతందని చెప్పారు.

Read Also.. Singapore: భారతీయులకు శుభవార్త.. అక్టోబర్ 26 నుంచి సింగపూర్‎కు వెళ్లొచ్చు..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...