AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైళ్లలో ప్రయాణించేటప్పుడు మహిళలకు ఎలాంటి హక్కులు ఉంటాయో తెలుసా?

మీరు భారతీయ రైల్వేలలో ప్రయాణించినప్పుడల్లా మీ హక్కులు, రైల్వే నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణ ప్రయాణీకుల కోసం రైల్వే అనేక నిబంధనలను రూపొందించింది. దీంతో ప్రజల రాకపోకలు సులభతరంగా మారాయి. అదేవిధంగా రైల్వే కూడా మహిళల కోసం అనేక నియమాలను రూపొందించింది..

Indian Railways: రైళ్లలో ప్రయాణించేటప్పుడు మహిళలకు ఎలాంటి హక్కులు ఉంటాయో తెలుసా?
Indian Railways
Subhash Goud
|

Updated on: Mar 16, 2024 | 4:59 PM

Share

మీరు భారతీయ రైల్వేలలో ప్రయాణించినప్పుడల్లా మీ హక్కులు, రైల్వే నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణ ప్రయాణీకుల కోసం రైల్వే అనేక నిబంధనలను రూపొందించింది. దీంతో ప్రజల రాకపోకలు సులభతరంగా మారాయి. అదేవిధంగా రైల్వే కూడా మహిళల కోసం అనేక నియమాలను రూపొందించింది. ఇందులో మహిళలు ఒంటరిగా ప్రయాణించి టిక్కెట్టు పొందలేకపోతే వారికి ఎలాంటి హక్కులు లభిస్తాయి? వారి కోసం ఎన్నో నిబంధనలు రూపొందించారు. ఇలాంటి హక్కులు సామాన్యులకు అస్సలు తెలియవు. అందువల్ల ఈ నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

రైల్వేలో మహిళా కోటాలో 45 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. దీనితో పాటు 3 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు కూడా ఈ మహిళలతో ప్రయాణించవచ్చు. ఆమె మహిళల కోటాలో మాత్రమే ఉంటారు. ఇంతకుముందు స్లీపర్ క్లాస్‌లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ సదుపాయం ఇప్పుడు ఏసీలో కూడా అందుబాటులోకి వచ్చింది.

రైలులో ప్రయాణించేటప్పుడు మహిళలు ఈ హక్కులు

ఇవి కూడా చదవండి

ట్రైన్‌లో రిజర్వేషన్లు లేకుంటే లేదా టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే టీటీఈ మహిళలను రైలు నుంచి దించలేరు. భారతీయ రైల్వే చట్టం ప్రకారం, మహిళ తన రైలు ప్రయాణాన్ని కొన్ని షరతులతో కొనసాగించడానికి అనుమతించబడింది. ఇది కాకుండా, రైలులో ఒక మహిళ ఒంటరిగా ప్రయాణిస్తుంటే, ఆమె టీటీఈతో మాట్లాడి తన సీటును మార్చవచ్చు. రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు మరిన్ని హక్కులు ఉన్నాయి. అయితే ఒక మహిళా ప్రయాణికురాలు రైలులో ప్రయాణిస్తుంటే టిక్కెట్టు లేకుంటే, అటువంటి పరిస్థితిలో TTE ఆమెను రైలు బోగీ నుండి బయటకు దించలేరు. TTE తదుపరి స్టేషన్‌లో టికెట్ పొందమని మహిళకు విజ్ఞప్తి చేయవచ్చు. స్త్రీ వద్ద డబ్బు లేకపోతే ఆమెపై ఎలాంటి ఒత్తిడి చేయడానికి వీలు లేదు. ఈ చట్టం 1989లో రూపొందించబడింది.

రాష్ట్రపతి నుంచి పోలీస్ మెడల్, ఇండియన్ పోలీస్ అవార్డు పొందిన మహిళలకు ఛార్జీలలో 50 శాతం రాయితీ ఇస్తారు. ఇది కాకుండా యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల భార్యలకు కూడా ఛార్జీలలో రాయితీ లభిస్తుంది. 182 హెల్ప్‌లైన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో మహిళలు భద్రతకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే