Income Tax Refund: కేవలం 10 రోజుల్లోనే ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్.. కీలక ప్రకటన చేసిన ఆదాయపు పన్ను
ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ముందుగానే అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా ? లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే వార్తను అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన రిటర్నుల (ITR) ధృవీకరణ తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ల సగటు ప్రాసెసింగ్ సమయం..

ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు ఐటీఆర్ విషయంలో కీలక అంశాలు తెలుసకోవడం చాలా ముఖ్యం. పన్ను రిటర్న్ కోసం దాఖలు చేసుకుంటే గతంలో ఎక్కువ రోజులు పట్టేది. అయితే అప్పటి వరకు వేచి ఉండాలి. అయితే ఐటీ రిటర్న్లో ఏవైనా పొరపాట్లు జరిగితే వాపసు నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ముందుగానే అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా ? లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే వార్తను అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన రిటర్నుల (ITR) ధృవీకరణ తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ల సగటు ప్రాసెసింగ్ సమయం 10 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా, FY 2022-23లో సగటు ప్రాసెసింగ్ సమయం 16 రోజులు, అలాగే FY 2019-20లో 82 రోజులు. సెప్టెంబర్ 5, 2023 వరకు ఆదాయపు పన్ను శాఖ డేటా ప్రకారం.. 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి 6.98 కోట్ల ఐటీఆర్లు సమర్పించుకున్నారు. 6.84 కోట్ల ఐటీఆర్లు ధృవీకరించబడ్డాయి.
5 సెప్టెంబర్ 2023 వరకు ధృవీకరించబడిన ఐటీఆర్లలో 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి 6 కోట్ల ఐటీఆర్లు ప్రాసెస్ చేయబడ్డాయి. అంటే 88 శాతం కంటే ఎక్కువ ధృవీకరించబడిన ITRలు ప్రాసెస్ చేయబడ్డాయి. 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి ఇప్పటికే 2.45 కోట్ల కంటే ఎక్కువ రీఫండ్లు జారీ అయ్యాయి.
ఐటీఆర్ ప్రాసెస్ చేయడానికి ముందు వాపసు స్వీకరించలేరు
ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికీ అనేక ఐటీఆర్ల ప్రాసెసింగ్ను పూర్తి చేయలేదు. ఇది కాకుండా కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ ప్రక్రియ సుదీర్ఘ వ్యవధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీఆర్ ప్రాసెస్ చేయబడే వరకు ఆదాయపు పన్ను వాపసు బ్యాంకు ఖాతాకు చేరదు. అటువంటి జిల్లాల్లో కూడా కొంత మంది వ్యక్తుల ఐటీఆర్లను డిపార్ట్మెంట్ ప్రాసెస్ చేయలేకపోవడాన్ని గమనించవచ్చు. ఇందులో తమ ఐటీఆర్ని ధృవీకరించని వ్యక్తులు కూడా ఉన్నారు.
ఈ వ్యక్తులు వాపసు పొందలేరు:
సెప్టెంబర్ 4, 2023 నాటికి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి దాదాపు 14 లక్షల మంది ఐటీఆర్ ఫైలర్లు తమ రిటర్నులను ఇంకా ధృవీకరించలేదు. దీంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను కోరింది. అదే సమయంలో అటువంటి 12 లక్షల మంది పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్ ప్రాసెస్ చేయబడలేదు. వీరి నుంచి డిపార్ట్మెంట్ సమాచారం కోరింది. అయితే పన్ను చెల్లింపుదారుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. మరోవైపు ఐటీఆర్ ప్రాసెస్ చేయబడిన కొంతమంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. రీఫండ్ మొత్తం కూడా నిర్ణయించబడింది. అయితే పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంక్ ఖాతాలను ధృవీకరించలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








