Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఇక క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు అవసరం లేకుండా కీ రింగ్స్‌, వాచ్‌ల ద్వారా చెల్లింపులు.. త్వరలో కొత్త టెక్నాలజీ

ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లి విత్‌త్రడాలు, డిపాజిట్లు చేసుకునేవారు. ఇప్పుడు ఆ బాధ తప్పిపోయింది. ఏటీఎం మిషన్‌లలో డిపాజిట్‌ చేయడం, ఇంట్లోనే ఉండి ఫోన్‌ ద్వారానే లావాదేవీలు జరపగడం జరుగుతూనే ఉంది. డిజిటల్‌ వ్యవస్థ వచ్చిన నాటి నుంచి ప్రజలకు టెక్నాలజీ మరింత చేరువువుతోంది..

RBI: ఇక క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు అవసరం లేకుండా కీ రింగ్స్‌, వాచ్‌ల ద్వారా చెల్లింపులు.. త్వరలో కొత్త టెక్నాలజీ
Credit Card And Debitcard
Follow us
Subhash Goud

|

Updated on: Sep 09, 2023 | 4:33 PM

దేశంలో రోజురోజుకు టెక్నాలజీ వ్యవస్థలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజులు గడుస్తున్న కొద్ది సాంకేతిక వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లి విత్‌త్రడాలు, డిపాజిట్లు చేసుకునేవారు. ఇప్పుడు ఆ బాధ తప్పిపోయింది. ఏటీఎం మిషన్‌లలో డిపాజిట్‌ చేయడం, ఇంట్లోనే ఉండి ఫోన్‌ ద్వారానే లావాదేవీలు జరపగడం జరుగుతూనే ఉంది. డిజిటల్‌ వ్యవస్థ వచ్చిన నాటి నుంచి ప్రజలకు టెక్నాలజీ మరింత చేరువువుతోంది.

ఇప్పుడు చెల్లింపు చేయడానికి మీకు క్రెడిట్ లేదా డెబిట్ అవసరం లేదు. ఇప్పుడు POS మెషీన్‌పై నొక్కడం ద్వారా చెల్లింపు జరుగుతుంది. వాస్తవానికి, డెబిట్, క్రెడిట్ కార్డుల త్వరలో కనుమరుగు కానున్నాయి. త్వరలో ఇవి నిరుపయోగంగా మారతాయి. మీరు ఇకపై డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఏటీఎం నుంచి డబ్బును విత్‌డ్రా చేయాల్సిన అవసరం లేదు. మీరు కీ రింగ్‌లు, వాచీల ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. లేదా ఏటీఎం నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆర్బీఐ ఇన్నోవేషన్ యూనిట్, ఎన్‌పీసీఐ ఈ పనిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అదే సమయంలో జీ20 భారత్ మండపంలో ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్‌లో ఇలాంటి అనేక ఉత్పత్తులు ప్రదర్శించబడతాయి.

జీ-20 సందర్భంగా విదేశీ అతిథులు ఈ ఇన్నోవేషన్ హబ్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఇందులో చెల్లింపు కోసం ట్యాప్ అండ్ పే సదుపాయాన్ని చూపించారు. దీనిని ఆర్బీఐ ఇటీవల ప్రారంభించింది. దీని కింద వినియోగదారులు 500 రూపాయల వరకు యూపీఐ చెల్లింపును సులభంగా చేయవచ్చు. దీని కోసం వారు మొబైల్ ఫోన్ నుండి ఎటువంటి QR కోడ్‌ని స్కాన్ చేయనవసరం లేకుండా, పిన్‌ను నమోదు చేయవలసిన అవసరం చేయకుండా, QR కోడ్ మెషీన్ లేదా POSలో మీ ఫోన్‌ను ట్యాప్ చేయడం ద్వారా మీరు ఒక్క క్షణంలో రూ. 500 వరకు చెల్లింపులు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

అయితే మీరు మీ కీ రింగ్ లేదా వాచ్‌ను సేల్ పాయింట్‌లో తాకడం ద్వారా బిల్లును చెల్లింపులు చేయవచ్చు. ఖాతాదారులకు బ్యాంకు అటువంటి కీ రింగ్‌లను అందిస్తోంది. స్మార్ట్‌వాచ్ తయారీ కంపెనీలు కూడా ఈ సదుపాయంతో కూడిన వాచీలను మార్కెట్‌లో విడుదల చేయబోతున్నాయి. అయితే ఈ సదుపాయం కేవలం రూపే కార్డులకు మాత్రమే.

బ్యాంకులతో టైఅప్ చేయడం ద్వారా ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు. ఎగ్జిబిషన్‌కు హాజరైన అధికారుల ప్రకారం.. రూపే కార్డు అతిపెద్ద సదుపాయం ఏమిటంటే దానిని డిజిటల్ రూపంలో ఉంచవచ్చు. అయితే వీసా లేదా మాస్టర్ కార్డ్ జారీ చేసిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఇంకా డిజిటల్ రూపంలో ఉంచలేరు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి