AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: కీలక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం.. మౌలిక వసతులను విక్రయించేందుకు రంగం సిద్దం..!

Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మౌలిక వసతులను..

Central Government: కీలక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం.. మౌలిక వసతులను విక్రయించేందుకు రంగం సిద్దం..!
Subhash Goud
|

Updated on: Aug 23, 2021 | 5:46 PM

Share

Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మౌలిక వసతులను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 6 లక్షల కోట్ల నిధులు సమీకరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగు పడేందుకు ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే కేంద్రం విక్రయించే జాబితాలో రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్ సరఫరా లైన్లు, గ్యాస్ పైప్‌లైన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ రోడ్‌ మ్యాప్‌ను ప్రకటించనున్నారు.

వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, కొన్ని కీలక రంగాలు మినహా మిగతా రంగాలను ప్రైవేటీకరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, పన్ను ఆదాయంలో కరోనా మహమ్మారి సమయంలో క్షీణించిన ఆర్థిక వ్యవస్థను భర్తీ చేయడానికి మార్చి 2022 వరకు ఈ విక్రయాలు జరపాలని భావిస్తోంది. అయితే మంత్రిత్వశాఖల ద్వారా మానిటైజింగ్‌ రోడ్ల ద్వారా వచ్చే ఆదాయం రూ.1.6 లక్షల కోట్లుగా అంచనా ఉంది. అలాగే రైల్వేల నుంచి రూ.1.5 లక్షల కోట్లు, విద్యుత్‌ రంగ ఆస్తులు రూ.లక్ష కోట్లు, గ్యాస్‌పైప్‌లైన్‌లు రూ.59వేల కోట్లు, టెలికమ్యూనికేషన్‌ ఆస్తులు రూ.40 వేల కోట్ల వరకు పొందవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా, గత ఏడాదికిపైగా కరోనా మహహ్మారి కారణంగా ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతోంది. మొదటి, రెండు దశల్లో ఆర్థికంగా బాగా కుంగిపోయింది. ఆ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పుడు థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలు ఉండటంతో ఆర్థికంగా మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇలాంటి విక్రయాల వల్ల మరింత ఆదాయం పెంచుకోవచ్చనే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం.

ఇవీ కూడా చదవండి:

Smart Prepaid Meters: స్మార్ట్ మీటర్లు రాబోతున్నాయ్‌.. ముందే రీచార్జ్ చేసుకోవాలి.. లేదంటే క‌రెంటు ఉండ‌దు..!

Income Tax Refund: పన్ను చెల్లింపుదారులకు ఊరట.. రూ.50వేల కోట్ల రీఫండ్‌.. డబ్బులు వచ్చాయా.? లేదా తెలుసుకోండిలా!

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!