Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basmati Ric: బాస్మతి బియ్యంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎగుమతి ధరను తగ్గించే యోచన

బాస్మతి వరిని భారతదేశం, పాకిస్తాన్‌లలో మాత్రమే పండిస్తారు. బాస్మతి దాని ప్రత్యేక సువాసనకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో బాస్మతీని అత్యధికంగా ఎగుమతి చేసే దేశం భారతదేశం. ఇది ఏటా 40 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. బాస్మతి బియ్యం భారతదేశం నుండి ఇరాన్, సౌదీ అరేబియా, యుఎఇ, ఇరాక్, యెమెన్, యుఎస్ఎలకు ఎగుమతి చేయబడుతుంది.

Basmati Ric: బాస్మతి బియ్యంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎగుమతి ధరను తగ్గించే యోచన
Basmati Rice
Follow us
Subhash Goud

|

Updated on: Oct 25, 2023 | 8:16 PM

బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధరను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బాస్మతి బియ్యం ధరను ప్రభుత్వం టన్నుకు 950 డాలర్లకు తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. బియ్యం ఎగుమతిదారులకు దీని వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అయితే, ప్రస్తుతం బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధర టన్నుకు $1,200.

వాస్తవానికి బాస్మతి బియ్యం ఎగుమతిదారులు, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మధ్య వర్చువల్ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో బాస్మతి బియ్యం ఎగుమతిదారుల డిమాండ్ మేరకు కనీస ఎగుమతి ధరను తగ్గించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బియ్యం ఎగుమతిదారులు మాట్లాడుతూ.. కనీస ఎగుమతి ధర ఎక్కువగా ఉండటం వల్ల విదేశాలకు భారతీయ బియ్యం ఎగుమతి తగ్గిందని తెలిపారు. అటువంటి పరిస్థితిలో డిమాండ్‌ను తీర్చడానికి, పాకిస్తానీ వ్యాపారవేత్తలు క్రమంగా అంతర్జాతీయ మార్కెట్‌లో తమ బలమైన పట్టును సాధిస్తున్నారు ఎందుకంటే దాని ధర భారతదేశంలోని బాస్మతి బియ్యం కంటే చాలా తక్కువగా ఉంది.

ప్రపంచ మార్కెట్‌లో బియ్యానికి డిమాండ్‌ పెరుగుతుంది:

ఇవి కూడా చదవండి

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బాస్మతి బియ్యం ఉత్పత్తి చేసే రైతులు, ఎగుమతి వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనీస ఎగుమతి ధరను తగ్గించడం వల్ల ప్రపంచ మార్కెట్‌లో బాస్మతి బియ్యానికి డిమాండ్ పెరుగుతుందని వారు భావిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో భారతదేశం నుండి బాస్మతి బియ్యం ఎగుమతి కూడా పెరుగుతుంది. ఇది నేరుగా రైతులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. వాస్తవానికి ఆగస్టు 25న కేంద్రం బాస్మతి కనీస ఎగుమతి ధరను టన్నుకు 1,200 డాలర్లకు పెంచింది. దీంతో ఎగుమతి తగ్గిపోవడంతో బియ్యం ఎగుమతిదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

రైతుల ఆదాయం మెరుగుపడుతుంది

అయితే, కనీస ఎగుమతి ధరను టన్నుకు 850 డాలర్లకు తగ్గిస్తామని సెప్టెంబర్ 25న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపారులకు హామీ ఇచ్చారు. అయితే అక్టోబర్ 14న ఎగుమతిదారుల ఆశలు అడియాశలయ్యాయి. బియ్యం కనీస ఎగుమతి ధర టన్నుకు $1200 వద్ద కొనసాగింది. కానీ అక్టోబర్ 23న జరిగిన సమావేశంలో కనీస ఎగుమతి ధరను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి పరిస్థితుల్లో మరికొద్ది రోజుల్లో అంతా సాధారణ స్థితికి వస్తుందని వ్యాపారులు భావిస్తున్నారు. అలాగే రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది.

బాస్మతి వరిని భారతదేశం, పాకిస్తాన్‌లలో మాత్రమే పండిస్తారు. బాస్మతి దాని ప్రత్యేక సువాసనకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో బాస్మతీని అత్యధికంగా ఎగుమతి చేసే దేశం భారతదేశం. ఇది ఏటా 40 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. బాస్మతి బియ్యం భారతదేశం నుండి ఇరాన్, సౌదీ అరేబియా, యుఎఇ, ఇరాక్, యెమెన్, యుఎస్ఎలకు ఎగుమతి చేయబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డ్రమ్ములో వేసే ముందు భర్త బాడీతో ఏం చేసిందో తెలుసా?
డ్రమ్ములో వేసే ముందు భర్త బాడీతో ఏం చేసిందో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
పెళ్లైన పది రోజులకే భర్తను..! సమాజం ఎటు పోతుంది?
పెళ్లైన పది రోజులకే భర్తను..! సమాజం ఎటు పోతుంది?
కలలో నెమలి కనిపిస్తుందా.. మంచిదా.. చెడ్డదా తెలుసుకోండి...
కలలో నెమలి కనిపిస్తుందా.. మంచిదా.. చెడ్డదా తెలుసుకోండి...
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో డాక్టర్ ఏం చేశాడంటే..
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో డాక్టర్ ఏం చేశాడంటే..
ఫుల్లుగా మద్యం తాగి పరీక్షహాలుకు వచ్చిన 10th విద్యార్ధి.. ఆ తర్వత
ఫుల్లుగా మద్యం తాగి పరీక్షహాలుకు వచ్చిన 10th విద్యార్ధి.. ఆ తర్వత
తల్లైనా తగ్గని అందం.. కాజల్ ను చూస్తే మతిపోవాల్సిందే!
తల్లైనా తగ్గని అందం.. కాజల్ ను చూస్తే మతిపోవాల్సిందే!
ఏంటీ.. కేజీ మామిడి రూ.3 లక్షలా?.. పెరట్లో ఈ చెట్టుంటే కోటీశ్వరులే
ఏంటీ.. కేజీ మామిడి రూ.3 లక్షలా?.. పెరట్లో ఈ చెట్టుంటే కోటీశ్వరులే