Gold Silver Price Today: మగువలకు బ్యాడ్‌న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Gold Silver Price Today: మగువలకు బ్యాడ్‌న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో
Follow us

|

Updated on: Mar 03, 2022 | 6:40 AM

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల (Bullion Market) తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు పెరుగున్నాయి. తాజాగా గురువారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.47,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 గా ఉంది. అయితే.. 22 క్యారెట్ల తులం బంగారంపై (Gold Price) రూ.1,000,.. 24 క్యారెట్లపై రూ.1,090 మేర పెరిగింది. కాగా.. వెండి ధరలు కూడా రూ.2,200 మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ. 67,200 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040, చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,800, 24 క్యారెట్ల ధర రూ.53,240 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,200 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.67,200 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.72,100 ఉంది. బెంగళూరులో రూ.72,100, కేరళలో రూ.72,100 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,100, విజయవాడలో రూ.72,100, విశాఖపట్నంలో రూ.72,100 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు మరో అరుదైన గౌరవం.. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..