Akshaya Tritiya: అక్షయ తృతీయ ఎఫెక్ట్‌.. మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు..ఎంత పెరిగిందో తెలిస్తే..

అక్షయ అంటే తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం, పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తుంటారు చాలా మంది. గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని అందరూ విశ్వసిస్తారు. శ్రీమహాలక్ష్మీ

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఎఫెక్ట్‌.. మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు..ఎంత పెరిగిందో తెలిస్తే..
Akshaya Tritiya 2024
Follow us

|

Updated on: May 10, 2024 | 12:57 PM

అక్షయ అంటే తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం, పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తుంటారు చాలా మంది. గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని అందరూ విశ్వసిస్తారు. శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వరాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం వుంటే చాలు జీవితంలో ఏ లోటు వుండదు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు.

అయితే గత వారం రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర అక్షయ తృతీయ రోజున అంటే మే 10వ తేదీన బంగారం ధర భారీగానే పెరిగింది. అయితే ఉదయం 6 గంటల సమయానికి బంగారం ధరల్లో తగ్గుముఖం ఉన్నప్పటికీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ధరల్లో భారీ మార్పు చోటు చేసుకుంది. భారీగా ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై ఏకంగా రూ.850 పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.930 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67,000 ఉండగా, 24 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ.73,090 వద్ద ఉంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి ధరపై ఏకంగా రూ.1300 వరకు ఎకబాకి మధ్యాహ్నం సమయానికి రూ.86,500 వద్ద కొనసాగింది.

అధిక ధరలు ఉన్నప్పటికీ, ఈ అక్షయ తృతీయ దేశంలో బంగారు ఆభరణాలు, నాణేలకు డిమాండ్ బాగానే ఉండవచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బంగారంపై విపరీతమైన రాబడి మధ్య బలమైన డిమాండ్ కారణంగా అక్షయ తృతీయ నాడు బంగారం అమ్మకాలు 14% పెరుగుతాయని అంచనా. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ప్రకారం, అక్షయ తృతీయ రోజున దేశవ్యాప్తంగా 25 టన్నుల వరకు బంగారం అమ్ముడవుతుందని అంచనా వేయగా, గత అక్షయ తృతీయ నాడు 22 టన్నుల బంగారం విక్రయాలు కొనసాగాయి. ఈసారి అక్షయ తృతీయతో పెళ్లిళ్ల సీజన్ లేదు. దీంతో వధువు కోసం భారీ నగలకు గిరాకీ లేదు. ఈసారి ధరల పెరుగుదల కారణంగా తేలికపాటి ఆభరణాలకు ప్రజలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం, వెండిపై పెట్టుబడి రాబోయే రోజుల్లో బంగారం కంటే ఎక్కువ రాబడిని ఇవ్వగలదు. వెండి బంగారం కంటే మెరుగైన పనితీరును కనబరుస్తుంది. నివేదిక ప్రకారం, 2024 సంవత్సరంలో ఇప్పటివరకు, బంగారం ధరలు 13% పెరిగాయి. వెండి ధరలు 11% పెరిగాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ