AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Import Duty: బంగారంపై ప్రభుత్వ తిరకాసు.. ఒక దగ్గర తీసేసి.. మరో దగ్గర పెంచేశారు..!

బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలన్న పరిశ్రమల డిమాండ్‌ను ఆమోదించినట్లు ఆర్థిక మంత్రి ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో అందరూ సంతోషించారు. కానీ.. అది ఎక్కువ సేపు నిలబడలేదు..

Gold Import Duty: బంగారంపై ప్రభుత్వ తిరకాసు.. ఒక దగ్గర తీసేసి.. మరో దగ్గర పెంచేశారు..!
Gold Import Duty
Subhash Goud
|

Updated on: Feb 20, 2023 | 7:37 PM

Share

బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలన్న పరిశ్రమల డిమాండ్‌ను ఆమోదించినట్లు ఆర్థిక మంత్రి ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో అందరూ సంతోషించారు. కానీ.. అది ఎక్కువ సేపు నిలబడలేదు.. ఎందుకంటే.. నిర్మలమ్మ ఒకవైపు దిగుమతి సుంకాన్ని తగ్గించారు.. మరోవైపు, వ్యవసాయ సెస్ రెట్టింపు చేశారు. ఈ కారణంగా బంగారం దిగుమతులపై మొత్తం పన్ను 15 శాతం వద్ద నుంచి ఏమాత్రం మార్పు చేయలేదు.

గతంలో బంగారం దిగుమతిపై 12.5 శాతం దిగుమతి సుంకం విధించారు. 2.5 శాతం వ్యవసాయ అభివృద్ధి సెస్ విడిగా విధించేవారు. అంటే దిగుమతులపై మొత్తం 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే ఈసారి ప్రభుత్వం 2023 బడ్జెట్‌లో ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించింది. మరోవైపు వ్యవసాయ అభివృద్ధి సెస్ 5 శాతానికి పెరిగింది. మొత్తం దిగుమతి సుంకం ఇంతకు ముందు లానే 15 శాతం వద్ద నిలిచింది.

అయితే ఈసారి వెండి దిగుమతులపై ప్రభుత్వం పన్నును నెరుగానే పెంచింది. గతంలో వెండి దిగుమతులపై 7.5 శాతం ప్రాథమిక దిగుమతి సుంకం ఉండేది. అలాగే 2.5 శాతం వ్యవసాయ అభివృద్ధి సెస్ కూడా విధించేవారు. దానిపైన 0.75 శాతం సాంఘిక సంక్షేమ సర్‌చార్జి కూడా ఉంది. అంటే మొత్తం వెండి దిగుమతులపై 10.75 శాతం పన్ను విధించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వెండి పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని10 శాతానికి పెంచింది. దీనితో పాటు వ్యవసాయ అభివృద్ధి సెస్‌ను కూడా 5 శాతానికి పెంచారు. అయితే సాంఘిక సంక్షేమ సర్‌చార్జ్‌ను రద్దు చేశారు. ఇప్పుడు వెండి దిగుమతులపై కూడా బంగారం మాదిరిగానే 15 శాతం పన్ను విధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నిజానికి ప్రభుత్వం ముందున్న సవాలు కరెంట్ ఖాతా లోటును నియంత్రించడం. దీని కోసం అనవసరమైన వస్తువుల దిగుమతిని అరికట్టడం ద్వారా ప్రభుత్వం తన డాలర్ల నిల్వలను ఆదా చేసుకోవాలనుకుంటోంది. 2022లో ప్రభుత్వం దాని దిగుమతులను నియంత్రించాలనుకుంది. ఇదే కారణం, బంగారం దిగుమతితో పాటు వెండి దిగుమతులను కూడా ప్రభుత్వం ఖరీదైనదిగా చేసింది. అయితే బంగారం, వెండి దిగుమతుల ధర పెరిగిన కారణంగా స్మగ్లింగ్ అవకాశం కూడా పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి