Gold Price Today: బంగారం ప్రియులకు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన ధర. తులంపై ఒక్క రోజే ఎంత తగ్గిందో తెలుసా.?
ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్నిరోజులుగా వరుసగా పెరుగుతూ పోయిన గోల్డ్ రేట్స్ మళ్లీ నేల చూపు చూస్తున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. జవనరి 10వ తేదీన రూ. 150, 11వ తేదీన రూ. 180 తగ్గిన బంగారం ధర తాజాగా గురువారం కూడా...
ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్నిరోజులుగా వరుసగా పెరుగుతూ పోయిన గోల్డ్ రేట్స్ మళ్లీ నేల చూపు చూస్తున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. జవనరి 10వ తేదీన రూ. 150, 11వ తేదీన రూ. 180 తగ్గిన బంగారం ధర తాజాగా గురువారం కూడా తగ్గుముఖం పట్టింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,450గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,110 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 51,300గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,960గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,300 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,050గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 51,350 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 56,010 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,300 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,950వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధరూ. 51,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,960 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 51,300, 24 క్యారెట్స్ ధర రూ. 55,960 గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి కూడా బంగారం దారిలో ప్రయణిస్తోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వెండి ధరలో పెరుగుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గురువారం కిలో వెండి ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం… దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,500గా ఉంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 71,500 వద్ద కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వెండి ధరలో పెరుగుదల కనిపించింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 74,000గా నమోదుకాగా, విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ. 74,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..