Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి అలర్ట్‌.. పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంత పెరిగిందంటే..

రెండు రోజుల పాటు వినియోగదారులకు ఊరటనిచ్చిన బంగారం ధరలు తాజాగా మళ్లీ షాక్‌కి గురి చేశాయి. బుధవారం బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో తులం బంగారంపై ఒకేసారి..

Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి అలర్ట్‌.. పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంత పెరిగిందంటే..
Gold & Silver Price
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 04, 2022 | 6:34 AM

రెండు రోజుల పాటు వినియోగదారులకు ఊరటనిచ్చిన బంగారం ధరలు తాజాగా మళ్లీ షాక్‌కి గురి చేశాయి. బుధవారం బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో తులం బంగారంపై ఒకేసారి సుమారు రూ. 400 వరకు పెరిగింది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. వెండి ధరలోనూ పెరుగుదల కనిపించింది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల ఎలా ఉన్నాయి.? లాంటి వివరాలు మీకోసం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 47,000 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51, 280గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,110 గా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,330 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 46,900 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధరూ. 51,160 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 46,850 గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 51,110 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 46,850 కాగా, 24 క్యారట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 51,110 గా ఉంది.

* సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 46,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,110గా ఉంది.

వెండి ధరల విషయానికొస్తే..

వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. సోమవారం స్థిరంగా కొనసాగిన వెండి ధర, మంగళవారం పెరిగింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో పెరుగుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎలా ఉందంటే..

న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 57,400 కాగా, ముంబైలో రూ. 57,400, చెన్నైలో రూ. 62,500 , బెంగళూరులో రూ. 62,500 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ. 62,500 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..