AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Price: అమ్మ బాబోయ్..! కిలో రూ. 500 మార్క్ చేరుకున్న నాణ్యమైన వెల్లుల్లి

వేసవికాలం రాకముందే నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. కొద్ది నెలల కిందట కొండెక్కిన ఉల్లి, టమాటా ధరలు దిగి రాగా.. ప్రస్తుతం అల్లం, వెల్లుల్లి రేట్లు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం వెల్లుల్లి ధర కిలో 500పైనే పలుకుతోంది. దాంతో.. వంటి గది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి నెలకొంది. కొద్దిరోజుల క్రితం.. రూ. 300 వరకు ఉన్న వెల్లుల్లి ధర.. రెండు వారాల్లోనే డబుల్‌ అయ్యే పరిస్థితి చేరింది.

Garlic Price: అమ్మ బాబోయ్..! కిలో రూ. 500 మార్క్ చేరుకున్న నాణ్యమైన వెల్లుల్లి
Garlic
J Y Nagi Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 28, 2024 | 7:57 AM

Share

వేసవికాలం రాకముందే నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. కొద్ది నెలల కిందట కొండెక్కిన ఉల్లి, టమాటా ధరలు దిగి రాగా.. ప్రస్తుతం అల్లం, వెల్లుల్లి రేట్లు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం వెల్లుల్లి ధర కిలో 500పైనే పలుకుతోంది. దాంతో.. వంటి గది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి నెలకొంది. కొద్దిరోజుల క్రితం.. రూ. 300 వరకు ఉన్న వెల్లుల్లి ధర.. రెండు వారాల్లోనే డబుల్‌ అయ్యే పరిస్థితి చేరింది.

వెల్లుల్లి లేని ఇంటి వంట బహుశా ఉండదేమో..! ఇలాంటి వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని తాకాయి. ధర ఒకేసారి 100% పెరిగి చుక్కలు చూస్తోంది. కొనలేక వంటింటి గృహిణులు మండిపడుతున్నారు. వంటింట్లో అందరూ వాడే వెల్లుల్లి ధర విపరీతంగా పెరిగిపోతుంది. ఔషధాల తయారీలో కూడా వాడే ఈ వెల్లుల్లి సాగు ఈ సంవత్సరం వర్షాభావం కారణంగా దిగుబడి భారీగా తగ్గిపోయింది. దీంతో సప్లై తగ్గి డిమాండ్ పెరిగి వినియోగదారులకు భారంగా మారింది. రిటైల్ మార్కెట్లో కిలో 500 రూపాయలు పెరిగింది.

వెల్లుల్లి దిగుబడి తగ్గడంతో మార్కెట్లోకి సరఫరా తగ్గిపోయింది. దీంతో ఇటీవల కొన్ని రోజుల్లోనే ధర అమాంతం పెరిగిపోయింది. రిటైల్ మార్కెట్లో కిలో నాణ్యతను బట్టి రూ. 350 నుంచి 500 రూపాయలకు చేరుకుంది. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ లో హోల్సేల్ మార్కెట్ లోనే రూ. 350 నుంచి 400 రూపాయలు పలుకుతోంది. నాణ్యమైన వెల్లుల్లి దర రూ. 500 దాటింది. ఉత్తరాదిన అనూహ్య వర్షాల వల్ల, దక్షిణాదిన వర్షాభావం వల్ల వెల్లుల్లి దిగుబడి దెబ్బతినిందని వ్యాపారులు అంటున్నారు. చాలా ప్రాంతాల్లో తుఫాను కూడా వెల్లుల్లి పంటను నష్టపరిచింది .దీనివల్ల మార్కెట్లోకి వెల్లుల్లి సప్లై తగ్గి ధరలు అమాంతం పెరిగిపోయాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం చలికాలంలో వెల్లుల్లి ధరలు పెరుగుతాయి. కొత్త పంట మార్కెట్లోకి వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది.

మరోవైపు ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెల్లుల్లి ఎగుమతిపై నిషేధం విధించింది. దేశంలోనే అతిపెద్ద వెల్లుల్లి మార్కెట్లలో ఒకటైన గుజరాత్ లోని జామునగర్, మండి మార్కెట్లలో కిలో వెల్లుల్లి టోకు ధర 300 నుంచి రూ. 350 కి చేరుకుందని అక్కడ వ్యాపారులు చెప్తున్నారు. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో రిటైల్ గా వచ్చేసరికి రూ. 500 కు చేరిందని చెప్తున్నారు. గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ వెల్లుల్లి ఎక్కువగా సాగు అవుతోంది. ప్రతి ఇంటికి అవసరమైన వెల్లుల్లి ధరలను కేంద్రo తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

ఇక.. అల్లం, వెల్లుల్లితోపాటు.. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…