AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO సభ్యులకు త్వరలో శుభవార్త అందనుందా? కనీస పెన్షన్ పెరగనుందా?

EPFO: ఈ సమస్యలకు త్వరిత పరిష్కారం చూపుతామని ప్రతినిధి బృందానికి మంత్రి హామీ ఇచ్చారని ప్రకటనలో పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా పెన్షనర్ల హక్కుల కోసం పోరాడుతున్న EPS-95 జాతీయ ఆందోళన కమిటీ (NAC), కేంద్రంతో ఇటీవలి చర్చల తర్వాత, EPS-95 కింద కనీస పెన్షన్ 10 సంవత్సరాల తర్వాత చివరకు సవరిస్తారనే నమ్మకం ఉందని తెలిపింది..

EPFO సభ్యులకు త్వరలో శుభవార్త అందనుందా? కనీస పెన్షన్ పెరగనుందా?
Follow us
Subhash Goud

|

Updated on: Feb 28, 2025 | 9:42 AM

ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో (EPFO) ​​కింద కనీస పెన్షన్ పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. సెప్టెంబర్ 2014లో EPFO ​​నిర్వహించే ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) కింద కవర్ చేయబడిన పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.1,000 కనీస పెన్షన్‌ను ప్రకటించింది. ఈపీఎఫ్‌ కింద ఉద్యోగులు తమ ప్రాథమిక జీతంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేస్తారు. కంపెనీలు కూడా అదే మొత్తాన్ని అందించాలి. కంపెనీ జమ చేసిన మొత్తంలో 8.33% EPSకి, 3.67% EPF ఖాతాకు వెళుతుంది.

EPFO సభ్యుల డిమాండ్ ఏమిటి?

EPS-95 కింద కనీస పెన్షన్ సహా వారి డిమాండ్లపై సకాలంలో చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారని పెన్షనర్ల సంఘం EPS-95 ఆందోళన కమిటీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈపీఎప్‌వో​కింద 78 లక్షలకు పైగా పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూల వైఖరిని తీసుకుందని పెన్షనర్ల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. కనీస ఈపీఎస్‌ పెన్షన్‌తో పాటు కనీస పెన్షన్ పెంచాలని, పదవీ విరమణ చేసిన వారికి, వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని, అధిక పెన్షన్ ప్రయోజనాల కోసం దరఖాస్తులలో తప్పులను సరిదిద్దాలని పెన్షనర్ల సంఘం డిమాండ్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?

ఇంకా, ఈ సమస్యలకు త్వరిత పరిష్కారం చూపుతామని ప్రతినిధి బృందానికి మంత్రి హామీ ఇచ్చారని ప్రకటనలో పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా పెన్షనర్ల హక్కుల కోసం పోరాడుతున్న EPS-95 జాతీయ ఆందోళన కమిటీ (NAC), కేంద్రంతో ఇటీవలి చర్చల తర్వాత, EPS-95 కింద కనీస పెన్షన్ 10 సంవత్సరాల తర్వాత చివరకు సవరిస్తారనే నమ్మకం ఉందని తెలిపింది.

2025 లో కనీస పెన్షన్ పెరుగుతుందా?

2025 బడ్జెట్‌కు ముందు EPS-95 రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి, కనీస పెన్షన్‌ను నెలకు రూ. 7,500కి పెంచాలని, అలాగే డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను జోడించాలని డిమాండ్ చేశారు. EPS-95 జాతీయ ఆందోళన కమిటీ ప్రకారం, వారి డిమాండ్లను పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.

గత 7-8 సంవత్సరాలుగా, పెన్షనర్లు తమ పెన్షన్ పెంచాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. డీఏ ప్రయోజనంతో పాటు ప్రస్తుత రూ.1,000 పెన్షన్‌ను రూ.7,500కి పెంచాలని వారు కోరుతున్నారు. దీనితో పాటు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య సౌకర్యాలను కూడా వారు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Facebook: ఫేస్‌బుక్ నీలం రంగులోనే ఎందుకు ఉంటుంది? కారణం చెప్పిన మార్క్ జుకర్‌బర్గ్

EPFO CBT (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్) సమావేశం ఫిబ్రవరి 28, 2025న జరగనుంది. దీనిలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. ఈ సమావేశంలో వడ్డీ రేటుపై ప్రధానంగా చర్చించినప్పటికీ, పెన్షన్ పెంపు అంశం కూడా ఈ సమావేశంలో ముఖ్యమైనది కావచ్చు.

ఇది కూడా చదవండి: Google: గూగుల్ నుంచి కీలక అప్‌డేట్‌.. ఇక నుంచి ఆ వివరాలు తొలగించడం సులభం!

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి