AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E-Shram Card: 15 కోట్లకుపైగా కార్మికుల రిజిస్ట్రేషన్లు.. ఈ పోర్టల్‌లో చేరితే బోలెడు లాభాలు.. అవేంటంటే?

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, ఇప్పటివరకు 15 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఇప్పటి వరకు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు.

E-Shram Card: 15 కోట్లకుపైగా కార్మికుల రిజిస్ట్రేషన్లు.. ఈ పోర్టల్‌లో చేరితే బోలెడు లాభాలు.. అవేంటంటే?
E Shram Portal
Venkata Chari
|

Updated on: Dec 28, 2021 | 6:09 AM

Share

E-Shram Card: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నిరంతరంగా నమోదు చేసుకుంటున్నారు. వాస్తవానికి, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, ఇప్పటివరకు సుమారు 15 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. అయితే ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ ఏడాది 26 ఆగస్టు 2021న, కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి చాలా మంది కార్మికులు ఇందులో చేరారు.

ఈ-శ్రామిక్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ప్రస్తుతం కేంద్రం ప్రారంభించిన పథకాలను సద్వినియోగం చేసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ప్రారంభించబోయే పథకాలను కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు.

ఈ-శ్రమ్ పోర్టల్‌లో 15 కోట్ల రిజిస్ట్రేషన్లు.. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సోమవారం ట్వీట్ చేస్తూ, ఈ-శ్రమ్ పోర్టల్‌లో ప్రతిరోజు రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్‌లు దాటుతున్నాయని.. ప్రతి గంటకు 50,000 మందికి పైగా అసంఘటిత కార్మికులు ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటున్నారని రాశారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో అనధికారిక రంగ కార్మికుల డేటాబేస్ తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను వారికి అందించడానికి సహాయపడుతుందని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల జాబితాలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. కాగా, పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, బీహార్ మూడో స్థానంలో నిలిచాయి. ఇది కాకుండా, లక్షద్వీప్‌లో అత్యల్ప రిజిస్ట్రేషన్ జరిగింది.

ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. 1. ఈ-శ్రమ్ పోర్టల్‌లో చేరిన కార్మికులు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ. 2 లక్షల వరకు బీమా పొందుతారు. అంటే కార్మికులకు బీమా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. దీని కింద ఏదైనా ప్రమాదంలో మరణిస్తే రూ.2 లక్షలు, పాక్షికంగా వికలాంగులైతే రూ.లక్ష చొప్పున అందజేస్తారు.

2 . ఇది కాకుండా, వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనం ఈ-శ్రమ్ కార్డ్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

3. విపత్తు లేదా అంటువ్యాధి వంటి పరిస్థితుల్లో కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యక్ష సహాయం పొందుతారు.

మీరు ఇంకా పోర్టల్‌లో నమోదు చేసుకోనట్లయితే, నమోదు చేసుకోవడానికి కేవలం రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని గుర్తుంచుకోండి. మొదట, మీరు ఆన్‌లైన్‌ని వెబ్‌సైట్‌ను సందర్శించి నమోదు చేసుకోవచ్చు. లేదా రెండవది కామన్ సర్వీస్ సెంటర్‌ని సందర్శించడం ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. అయితే ఈ రెండు ఆప్షన్లలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఈ పత్రాలు అవసరం. ఇందులో ఆధార్‌తో మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోవడం తప్పనిసరి.

Also Read: Hero Lectro: బ్లూటూత్ కనెక్టివిటీతో హీరో రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు.. ధర ఎంతో తెలుసుకోండి..

బర్గర్ తినండి.. సైకిల్ తొక్కండి.. నో వేస్ట్.. నో రెస్ట్.. బెస్ట్ ఆఫర్ చేసిన ఓ చైనా బేకరీ..

Follow Us