AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1000 రూపాయల నోటు మళ్లీ ప్రారంభించనున్నారా..? పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చిన మంత్రి

రూ.2000 నోటుపై నిషేధం అంశం పార్లమెంట్ హౌస్‌లోనూ ప్రతిధ్వనించింది. దీంతో పాటు 1000 రూపాయల నోటు మళ్లీ ప్రారంభం కానుందా అనే ప్రశ్న కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. అంతే కాకుండా రూ.2000 నోట్లను డిపాజిట్ చేసే చివరి..

1000 రూపాయల నోటు మళ్లీ ప్రారంభించనున్నారా..? పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చిన మంత్రి
Rs 1000 Note
Subhash Goud
|

Updated on: Jul 25, 2023 | 3:48 PM

Share

రూ.2000 నోటుపై నిషేధం అంశం పార్లమెంట్ హౌస్‌లోనూ ప్రతిధ్వనించింది. దీంతో పాటు 1000 రూపాయల నోటు మళ్లీ ప్రారంభం కానుందా అనే ప్రశ్న కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. అంతే కాకుండా రూ.2000 నోట్లను డిపాజిట్ చేసే చివరి తేదీని ఇంకా పొడిగించవచ్చా అనే ప్రశ్న కూడా పార్లమెంట్‌లో తలెత్తింది. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం చాలా సూటిగా సమాధానం చెప్పింది. మే నెలలో ప్రభుత్వం రూ. 2000 నోట్లను వెనక్కి తీసుకుని సెప్టెంబర్‌లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 30న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు సమయం నిర్ణయించారు. అప్పటి వరకు 2000 రూపాయల నోటు చట్టబద్ధంగా ఉంటుంది.

2000 రూపాయల నోటును డిపాజిట్ చేసే తేదీని పొడిగిస్తారా?

దీనిపై విపక్షాలకు చెందిన కొందరు నేతల తరఫున ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. అయితే కేంద్ర ఆర్థిక ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు గడువు పెంపుదల ఉండదని బదులిచ్చారు. సెప్టెంబర్ 30 వరకు గడువు ఉందన్నారు. దేశం మొత్తం రూ.2000 నోట్లను నిర్ణీత గడువులోగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సామాన్యులకు రూ.2000 నోట్లను డిపాజిట్ చేసేందుకు 2 నెలలకు పైగా సమయం ఉంది.

నోట్ల రద్దు మళ్లీ వస్తుందా?

నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం మళ్లీ నోట్ల రద్దు యోచనలో ఉందా అని పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ.. కరెన్సీని రద్దు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో పనిచేయడం లేదని అన్నారు. 2016 నవంబర్‌లో ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిందని తెలిపారు. అదే సమయంలో రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మే 2023లో 2000 రూపాయల నోట్ల రద్దు ప్రకటన వెలువడింది. ఈ ప్రక్రియ అంతా ఇదే విషయమై సాగుతోంది.

ఇవి కూడా చదవండి

రూ.1000 నోటు మళ్లీ ప్రవేశపెడుతుందా?

ఆ తర్వాత ప్రభుత్వం 1000 రూపాయల నోటును మళ్లీ ప్రారంభించగలదా అని ఆర్థిక మంత్రిత్వ శాఖను అడిగారు. దీనికి సూటిగా సమాధానం చెప్పకుండా, రిజర్వ్ బ్యాంక్ ప్రకారం, 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవడంలో ప్రధాన ఉద్దేశ్యం కరెన్సీ నిర్వహణ ఆపరేషన్ అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి చెప్పారు. దీంతో పాటు బ్యాంకుల్లో జమ అవుతున్న లేదా మార్చుకుంటున్న 2000 రూపాయల నోట్లకు బదులుగా ఇస్తున్న ఇతర నోట్లు గణనీయంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ మధ్య కాలంలో 1000 రూపాయల నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద కరెన్సీ 500 రూపాయల నోటు రూపంలో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us