AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: ఆర్థిక లోటును తగ్గించడానికి మోడీ ప్రభుత్వం ఏం చేయనుంది? అంచనా ఏమిటి?

లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఖర్చును తగ్గించుకోలేమని ఓ బ్రోకరేజీ సంస్థ పేర్కొంది. బదులుగా, ద్రవ్యలోటును తగ్గించడానికి ఆర్థిక వృద్ధి దిశపై దృష్టి పెట్టాలి. ఒకవైపు డిజిటలైజేషన్‌ను పెంచడం ద్వారా ఆర్థిక వృద్ధి పటిష్టం అవుతుందని, మరోవైపు వృథా ఖర్చులను తగ్గించడంపై కూడా కేంద్రం దృష్టి సారిస్తుందని సంస్థ పేర్కొంది. 2025-26 నాటికి ద్రవ్యలోటును..

Budget 2024: ఆర్థిక లోటును తగ్గించడానికి మోడీ ప్రభుత్వం ఏం చేయనుంది? అంచనా ఏమిటి?
Budget 2024
Subhash Goud
|

Updated on: Jan 23, 2024 | 3:31 PM

Share

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో తన మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్‌ కావడంతో అన్ని వర్గాల వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా లోటు బడ్జెట్‌ను తీర్చాలని కేంద్రం భావిస్తోంది. అలాగే పన్ను చెల్లింపుదారులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఈ బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు ఏదైనా ఉపశమనం కల్పించనున్నారా? లేదా అనేది చర్చ కొనసాగుతోంది.

లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది పూర్తి బడ్జెట్ కానప్పటికీ ఈసారి ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లోటును 5.3 శాతానికి తగ్గించడమే సీతారామన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మోదీ ప్రభుత్వం ద్రవ్యలోటును 5.9 శాతానికి తగ్గించగలదని అంచనా.

లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఖర్చును తగ్గించుకోలేమని ఓ బ్రోకరేజీ సంస్థ పేర్కొంది. బదులుగా, ద్రవ్యలోటును తగ్గించడానికి ఆర్థిక వృద్ధి దిశపై దృష్టి పెట్టాలి. ఒకవైపు డిజిటలైజేషన్‌ను పెంచడం ద్వారా ఆర్థిక వృద్ధి పటిష్టం అవుతుందని, మరోవైపు వృథా ఖర్చులను తగ్గించడంపై కూడా కేంద్రం దృష్టి సారిస్తుందని సంస్థ పేర్కొంది. 2025-26 నాటికి ద్రవ్యలోటును జిడిపిలో 4.5 శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగించవచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు. ఆ అవకాశం అలాగే ఉంది. మోడీ ప్రభుత్వం కూడా పెట్టుబడులు వేగంగా జరగాలని నొక్కి చెప్పవచ్చు. అలాంటప్పుడు ఒకవైపు ఉత్పాదకత పెరుగుతుంది. మరోవైపు ఎగుమతులు కూడా వేగవంతం అవుతాయి. ఉపాధి పెరుగుతుంది. ఫలితంగా ఆ లోటును తీర్చే సౌకర్యాలు ఉంటాయని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి