Budget 2023: బడ్జెట్‌లో విద్యారంగ్యానికి అధిక ప్రాధాన్యత.. భారీగా విద్యా సంస్థల ఏర్పాటు..

2023-24 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్‌లో విద్య, ఉద్యోగ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు..

Budget 2023: బడ్జెట్‌లో విద్యారంగ్యానికి అధిక ప్రాధాన్యత.. భారీగా విద్యా సంస్థల ఏర్పాటు..
Education
Follow us

|

Updated on: Feb 01, 2023 | 12:59 PM

2023-24 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్‌లో విద్య, ఉద్యోగ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇప్పటికే 157 మెడికల్ కాలేజీలు ఉండగా.. వీటిని అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం మిషన్‌ను ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా ఫార్మాలో పరిశోధనలను ప్రోత్సహిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. ఇందులోభాగంగా పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులు ఆహ్వానించారు.

ఇక వైద్యరంగంలో కొత్త కోర్సులు తీసుకురానున్నారు. తాజా పరిశోధనలపై దృష్టి సారించనున్నారు. దీంతోపాటు ఉపాధ్యాయుల శిక్షణను మెరుగుపరుస్తామన్నారు. ఇందుకోసం వైబ్రంట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్ననట్లు తెలిపారు. కోవిడ్‌లో చదువుల నష్టాన్ని భర్తీ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తామన్నారు. ఆర్థిక నియంత్రణ సంస్థను కూడా ఇందులో చేర్చనున్నారు. ప్రతి అభివృద్ధి పథకం.. చివరి ప్రజలకు వరకూ చేరాలనేదే తమ సంకల్పం అని చెప్పారు ఆర్థిక మంత్రి.

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38,800 మంది టీచర్లను నియమించనున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి. ఈ ప్రకారం.. రాబోయే 3 సంవత్సరాలలో, దేశవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలల్లో 8,000 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించనున్నారు. పిల్లలు, యువత కోసం డిజిటల్ లైబ్రరీలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నేషనల్ డిజిటల్ లైబ్రరీ పంచాయతీ, వార్డు స్థాయి వరకు ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. పుస్తకాలు స్థానిక, ఆంగ్ల భాషలలో అందుబాటులో ఉంటాయని, అలాగే వయస్సును బట్టి పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..