Adani Group: గౌతమ్‌ ఆదానీ సంచలన నిర్ణయం.. ఆ రాష్ట్రంలో రూ.57 వేల కోట్లకుపైగా పెట్టుబడులు.. ఆ ప్లాన్‌ ఏంటో తెలుసా..?

Adani Group: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధనవంతుల్లో గౌతమ్‌ ఆదానీ ఒకరు. ఆదానీ గ్రూప్‌ పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో భారీ ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తుంది. ఇక ఆదానీ ఒడిశాలో 57వేల కోట్ల రూపాయల..

Adani Group: గౌతమ్‌ ఆదానీ సంచలన నిర్ణయం.. ఆ రాష్ట్రంలో రూ.57 వేల కోట్లకుపైగా పెట్టుబడులు.. ఆ ప్లాన్‌ ఏంటో తెలుసా..?
Adani Group
Follow us

|

Updated on: Aug 12, 2022 | 3:02 PM

Adani Group: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధనవంతుల్లో గౌతమ్‌ ఆదానీ ఒకరు. ఆదానీ గ్రూప్‌ పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో భారీ ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తుంది. ఇక ఆదానీ ఒడిశాలో 57వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అదానీ గ్రూప్‌కు చెందిన రెండు ప్రాజెక్టులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండు ప్రాజెక్టుల్లోనూ గ్రూప్ మొత్తం రూ.57,575 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అదానీ గ్రూప్ వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టులు ఒడిశాలో దాదాపు 9300 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించనున్నాయి. అదే సమయంలో దీని కంటే ఎక్కువ మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది. ఈ రెండు ప్రాజెక్టులు మెటల్ రంగానికి సంబంధించినవి. ఒడిశాలో దేశం బేస్ బాక్సైట్ నిల్వలు ఉన్నాయి. ఇనుప ఖనిజ నిక్షేపాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. గౌతమ్ అదానీ ఇప్పటికే అనేక కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతున్నారు.

ఏయే ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి..

ఒడిశా ప్రభుత్వ ఉన్నత స్థాయి క్లియరెన్స్ అథారిటీ 4 MMPTA సామర్థ్యంతో సమీకృత అల్యూమినా రిఫైనరీ, 30 MMPTA సామర్థ్యంతో ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదనను ఆమోదించింది. ఈ సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. మనకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో ఒడిశా ఒకటన్నారు. లోహానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, అందులో దేశం స్వయం సమృద్ధి సాధించడం అవసరమన్నారు. సంభావ్య బాక్సైట్ నిక్షేపాలు లేదా ప్రస్తుత గనుల సమీపంలో ఇంటిగ్రేటెడ్ అల్యూమినా రిఫైనరీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది స్మెల్టర్ గ్రేడ్ అల్యూమినాను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సహాయంతో భారతదేశం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి

గత వారం 11 ప్రతిపాదనలు ఆమోదం..

గత వారం ఒడిశా ప్రభుత్వం కూడా రూ.2,253 కోట్ల విలువైన 11 పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా దాదాపు 4 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర స్థాయి సింగిల్ విండో క్లియరెన్స్ అథారిటీ వర్చువల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్ర కూడా ఆమోదం పొందిన యూనిట్ల ప్రారంభానికి తగిన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ ప్రతిపాదనలు అల్యూమినియం, స్టీల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి వివిధ రంగాలకు చెందినవి. ఈ ప్రాజెక్ట్‌లలో క్లౌడ్ హోస్టింగ్ సేవల కోసం ఖుర్దాలో రూ. 500 కోట్లతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ డేటా సెంటర్ సౌకర్యం కూడా ఉంది. సుందర్‌గఢ్‌లో రూ.533 కోట్లతో ఇనుము శుద్ధీకరణ కర్మాగారం, కటక్‌లో పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానున్నాయి.

ఇదికూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..