AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. ఈ సారి భారీగా పెంపు

7th Pay Commission: ఆగస్టు నెల ప్రభుత్వ ఉద్యోగులకు అదృష్టం కలిసి రానుంది. భారీ ప్రయోజనం చేకూరనుంది. ఈసారి ఉద్యోగుల డీఏలో భారీ పెంపుదల ఉండనుంది...

7th Pay Commission: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. ఈ సారి భారీగా పెంపు
7th Pay Commission
Subhash Goud
|

Updated on: Aug 16, 2022 | 8:29 PM

Share

7th Pay Commission: ఆగస్టు నెల ప్రభుత్వ ఉద్యోగులకు అదృష్టం కలిసి రానుంది. భారీ ప్రయోజనం చేకూరనుంది. ఈసారి ఉద్యోగుల డీఏలో భారీ పెంపుదల ఉండనుంది. మధ్యప్రదేశ్, గుజరాత్ తర్వాత ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ కానుకను ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లోని భూపేష్ బఘెల్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 6 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పెద్ద నిర్ణయం తర్వాత ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు 28 శాతం డియర్‌నెస్ అలవెన్స్ లభిస్తుంది. ఈ నిర్ణయంతో 3.8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

ప్రభుత్వం భారీ ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగులు 7వ వేతన సంఘం కింద 22 శాతం, 6వ వేతన సంఘం కింద 174 శాతం కరువు భత్యం పొందడం గమనార్హం. కానీ ఇప్పుడు 7వ వేతన సంఘం కింద 6 శాతం, 6వ వేతన సంఘం కింద 15 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచారు. ఈ పెంపు ఆగస్టు 1, 2022 నుండి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై రూ.2,160 కోట్ల భారం పడనుంది.

ఇవి కూడా చదవండి

ఇటీవల ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం.. గుజరాత్ ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచింది. ఇది జనవరి 1, 2022 నుండి అమలులోకి వస్తుంది. గతంలో త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి.

కేంద్ర ఉద్యోగుల డీఏ కూడా పెంపు

త్రిపురలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 5 శాతం పెంచింది. అంతకుముందు, అదే సమయంలో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని 3% పెంచారు. దానిని 31 శాతం నుండి 34 శాతానికి పెంచారు. రానున్న కొద్ది రోజుల్లో కేంద్ర ఉద్యోగుల కరువు భత్యాన్ని 39 శాతానికి పెంచవచ్చని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి