AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుంగభద్ర నది పుష్కర పనులు పరిశీలించిన బుగ్గన

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు నగరంలో ఇవాళ పర్యటించారు. త్వరలో జరగనున్న తుంగభద్రా నది పుష్కరాలకు సంబంధించి పుష్కర ఘాట్ లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో అధికారులు,ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. తుంగభద్ర నది వెంట జరుగుతున్న పుష్కర ఘాట్ లలో నిర్మాణాలను ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆఫీస్ ఖాన్, ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ లతో […]

తుంగభద్ర నది పుష్కర పనులు పరిశీలించిన బుగ్గన
Venkata Narayana
|

Updated on: Oct 31, 2020 | 2:59 PM

Share

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు నగరంలో ఇవాళ పర్యటించారు. త్వరలో జరగనున్న తుంగభద్రా నది పుష్కరాలకు సంబంధించి పుష్కర ఘాట్ లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో అధికారులు,ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. తుంగభద్ర నది వెంట జరుగుతున్న పుష్కర ఘాట్ లలో నిర్మాణాలను ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆఫీస్ ఖాన్, ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ లతో కలిసి పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేయిస్తున్నామని పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి బుగ్గన ఈ సందర్భంగా టీవీ9కి తెలిపారు.