Andhra Pradesh: వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు.. అటు సీబీఐ దూకుడు.. ఇటు హైదరాబాద్ కోర్టుకు కేసు బదిలీ..

నిజం తేలాలి. న్యాయం గెలవాలి. వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ నోటీసులపై అవినాష్‌రెడ్డి రెస్పాన్స్‌ ఇది. అంత పెద్ద నాయకుడిని చంపేస్తే నిందితుల్ని పట్టుకోవడానికి ఇన్ని రోజులా.

Andhra Pradesh: వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు.. అటు సీబీఐ దూకుడు.. ఇటు హైదరాబాద్ కోర్టుకు కేసు బదిలీ..
Ys Avinash Reddy
Follow us

|

Updated on: Jan 24, 2023 | 9:00 PM

నిజం తేలాలి. న్యాయం గెలవాలి. వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ నోటీసులపై అవినాష్‌రెడ్డి రెస్పాన్స్‌ ఇది. అంత పెద్ద నాయకుడిని చంపేస్తే నిందితుల్ని పట్టుకోవడానికి ఇన్ని రోజులా. త్వరగా కేసును తేల్చాలి. ఇదీ వైఎస్‌ షర్మిల రియాక్షన్‌. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు ఫైల్స్‌ అన్నీ కడప నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు చేరాయి. ఇలా దివంగత నేత వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవేంటో ఓ లుక్కేసుకుందాం..

వైఎస్‌ వివేకా హత్య కేసులో ఆరోపణలపై తొలిసారి స్పందించారు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి. సీబీఐ ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూనే తనపై కొందరు చేస్తున్న ఆరోపణలను తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఆరోపణల్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. ఈ కేసులో నిజమేంటో తేలాలన్నారు. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు అవినాష్‌రెడ్డి. నోటీసు ఇచ్చిన 24 గంటల్లోనే హాజరు కావాలని కోరడం కరెక్ట్‌ కాదని, నాలుగైదు రోజుల వరకు ముందే ఫిక్స్‌ చేసిన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పారు. ఆ డేట్ల తర్వాత రావాలని సీబీఐ మళ్లీ నోటీసు ఇస్తే కచ్చి వెళ్లి వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు.

వైఎస్ షర్మిల రియాక్షన్..

మరోవైపు ఈ పరిణామాలపై మీడియా ప్రశ్నలకు రియాక్ట్‌ అయ్యారు వైఎస్‌ షర్మిల. వివేకా లాంటి పెద్ద నాయకుడిని హత్య చేస్తే కూడా కేసును తేల్చడానికి ఇన్ని రోజులా అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణకు కేసు బదిలీ..

ఇంకోవైపు సీబీఐ కేసును తెలంగాణకు బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ ఫైల్స్‌ అన్నీ హైదాబాద్‌ సీబీఐ కోర్టు చేరాయి. కడప జిల్లా సెషన్స్‌ కోర్టులో ఉన్న 3 పెట్టెల్లో చార్జిషీట్లు కాగితాలు, సాక్షుల వాంగ్మూగలాలు, ఇతర ఫైల్స్‌ హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..