AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఎందుకు నవీన్ ఇలా చేశావ్.. మొబైల్ రీఛార్జ్‌కు డబ్బులు ఇవ్వలేదని..

మొబైల్ రీఛార్జ్ ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. రీజార్జ్ కోసం.. తండ్రి వంద రూపాయలు ఇవ్వలేదని ఓ యువకుడు నూరేళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన తల్లిదండ్రులను, బంధువులను, గ్రామస్థులను శోకసముద్రంలో ముంచింది.

Andhra Pradesh: ఎందుకు నవీన్ ఇలా చేశావ్.. మొబైల్ రీఛార్జ్‌కు డబ్బులు ఇవ్వలేదని..
Crime News
Nalluri Naresh
| Edited By: |

Updated on: Feb 17, 2026 | 7:51 PM

Share

మొబైల్ రీఛార్జ్ ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. రీజార్జ్ కోసం.. తండ్రి వంద రూపాయలు ఇవ్వలేదని ఓ యువకుడు నూరేళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన తల్లిదండ్రులను శోకసముద్రంలో ముంచింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలం కళ్యం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు మొబైల్ రీఛార్జ్ చేయించుకోవడానికి డబ్బులు కావాలని తండ్రిని అడిగాడు. రైతు కూలీ అయిన తండ్రి రామకృష్ణ.. ప్రస్తుతం చేతిలో డబ్బులు లేవని.. ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని చెప్పాడు.. దీంతో కొడుకు నవీన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

మొబైల్ రీఛార్జ్ చేసుకునేందుకు డబ్బులు అడిగితే.. తన తండ్రి ఇవ్వలేదని తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు.. క్షణికావేశంలో నవీన్ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నవీన్ ను గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే అతన్ని బళ్ళారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే నవీన్ పరిస్థితి విషమించింది.. చికిత్స పొందుతూ నవీన్.. ఆసుపత్రిలో చనిపోయాడు.

దీంతో ఒక్కగానొక్క కొడుకు మొబైల్ రీఛార్జ్ కు డబ్బులు ఇవ్వలేదన్న చిన్న కారణంతో ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ముగ్గురు కూతుళ్లను చదివిస్తూ.. చాలీచాలని ఆదాయంతో.. కౌలు రైతుగా పనిచేస్తున్న రామకృష్ణ ఒక్కగానొక్క కొడుకు నవీన్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా యువకుడు నవీన్ తొందరపడి తీసుకున్న నిర్ణయం.. తల్లిదండ్రులను పుట్టెడు దుఃఖంలోకి నెట్టింది.

ఏదీఏమైనా ఆత్మహత్య అనేది క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం.. ఇలాంటి ఆలోచనలు అస్సలు మంచిది కాదు.. మనోవేదనకు లోనైతే.. తల్లిదండ్రులకు చెప్పుకోవాల్సింది పోయి.. ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.