Vizianagaram: కూతుర్ని హీరోయిన్‌ చేయాలని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి టార్చర్.. పాపం బాలిక..

Vizianagaram News in Telugu: విజయనగరం పట్టణంలోని తోటపల్లిలో దారుణ ఘటన వెలుగుచూసింది. కన్నకూతురిని తల్లే చిత్రహింసలకు గురిచేసింది. సినిమాలపై మోజుతో బాలికకు హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చింది. దీంతో తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Vizianagaram: కూతుర్ని హీరోయిన్‌ చేయాలని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి టార్చర్.. పాపం బాలిక..
Vizianagaram News
Follow us

|

Updated on: Jun 04, 2023 | 4:40 PM

కన్న కూతురి పట్ల ఓ తల్లి అత్యంత పాశవికంగా వ్యవహరించింది. కూతురుని హీరోయిన్ చేయాలనే పిచ్చిలో నరకం చూపింది. మాయగాళ్ల మాటలు విని అభం శుభం తెలియని బాలికకు ఇంజెక్షన్లు ఇచ్చి శరీరాన్ని కుళ్ల బొడిచింది. మాట వినకపోతే చిత్రహింసలు పెట్టి వేధించింది. ఆ బాధ భరించలేక బాలిక చైల్డ్ లైన్ అధికారులను ఆశ్రయించడంతో ఎట్టకేలకూ తల్లి చెర నుండి బయటపడింది. ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

విజయనగరం తోటపాలెంలో నివాసం ఉండే మహిళకు కుమార్తె పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. దీంతో ఆమె మరో వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు సమాచారం. మొదటి భర్తతో పుట్టిన బాలిక విశాఖలో ప్రభుత్వ విద్యాసంస్థలో ఇటీవలే టెన్త్‌ క్లాస్‌ పూర్తి చేసి, వేసవి సెలవులకు ఇంటికొచ్చింది. ఐతే తల్లి దగ్గరకు తరచూ కొత్త వాళ్లు వస్తుండడంతో అక్కడ ఉండడం ఇష్టంలేక తల్లితో గొడవపడింది. ఈ మధ్య ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి బాలికను చూసి సినిమాల్లో హీరోయిన్‌ అయ్యే లక్షణాలు ఉన్నాయన్నాడు. అయితే శరీర భాగాలు ఇంకా పెరగాలని ఆమెకు చెప్పారు. అతను చెప్పినట్లు కుమార్తెకు నిత్యం ఇంజెక్షన్లు ఇప్పించడం మొదలుపెట్టింది. దీంతో బాలిక అనారోగ్యానికి గురైంది. రోజూ ఇచ్చే ఇంజెక్షన్ల బాధ భరించలేకపోయేది. ఇంజెక్షన్లు వద్దని తల్లిని వేడుకున్నా ఆమె కనికరించేది కాదు. చివరకు చైల్డ్ లైన్ అధికారులకు చెప్పడంతో, వాళ్లు అధికారులు , పోలీసులకు సమాచారం ఇచ్చి బాలికను రక్షించారు.

మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కూడా స్పందించి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో తల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారిని కూడా విచారించారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు జిల్లాఎస్పీ దీపిక. అయితే తల్లి పెట్టిన మానసిక, శారీరక వేధింపులతో పాటు అవయవాలు పెరగటానికి ఇచ్చిన మెడిసిన్ కారణంగా బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చంటున్నారు వైద్యులు. మొత్తానికి స్టెరాయిడ్స్‌ లాంటి ఇంజక్షన్లు మొదటికే మోసం అంటున్నారు వైద్య నిపుణులు. ఇవి ఒక్కోసారి ప్రాణాలమీదకి తెస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించవద్దంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు