Korukonda: నేడు సైనిక్ స్కూల్ లో ఘనంగా జరగనున్న స్వర్నిమ్ విజయ్ వర్ష్ వేడుకలు. ఎందుకంటే..!

విజయనగరం జిల్లా ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ లో ఇవాళ స్వర్నిమ్ విజయ్ వర్ష్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి

Korukonda: నేడు సైనిక్ స్కూల్ లో ఘనంగా జరగనున్న స్వర్నిమ్ విజయ్ వర్ష్ వేడుకలు. ఎందుకంటే..!
Swarnim Vijay Varsh Torch
Follow us

|

Updated on: Sep 04, 2021 | 9:16 AM

Swarnim Vijay Varsh: విజయనగరం జిల్లా ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ లో ఇవాళ స్వర్నిమ్ విజయ్ వర్ష్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. 1971 లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇవాళ విక్టరీ టార్చ్ కోరుకొండ సైనిక్ స్కూల్ కి తరలిరానున్న నేపథ్యంలో ఈ వేడుకలు ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ, నేవీ, జిల్లా అధికారులు పాల్గోనున్నారు.

కాగా, బంగ్లాదేశ్​ స్వాతంత్య్ర యుద్ధంలో పాకిస్థాన్​ను భారత్​ ఓడించి 2021 డిసెంబర్​ 3కు యాబై ఏళ్లు నిండాయి. అందువల్ల ఈ ఏడాదంతా స్వర్ణం విజయ్​ వర్ష్​ ఉత్సవాల్ని నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆనాటి విజయానికి గుర్తుగా ఉన్న స్వర్ణిమ్​ విజయ్‌ వర్ష్​ జ్యోతి ఇప్పటికే విశాఖపట్నం తూర్పు నౌకాదళానికి చేరిన సంగతి తెలిసిందే. భారత రక్షణ దళాల ధీరోదాత్త పోరాటాల ఫలితంగా 1971లో భారతదేశం పాకిస్థాన్‌పై విజయం సాధించింది.

బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం రావడానికి భారత్ అప్పట్లో పూర్తి సహకారం అందించింది. ఆ యుద్ధం జరిగి 50 ఏళ్లవుతున్న నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరాన్ని ‘స్వర్ణిమ్​ విజయ్‌ వర్ష్​’గా ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గత సంవత్సరం డిసెంబరు 16న దిల్లీలోని నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద ‘ఎటర్నల్​ ఫ్లేమ్​’ నుంచి నాలుగు విజయ జ్యోతులు వెలిగించారు. ఆ జ్యోతులను దేశంలోని నాలుగు దిక్కులకు పంపారు. దక్షిణ భారతదేశం వచ్చిన విజయ జ్యోతి వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఇప్పుడు విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్ కు చేరుకుంది.

Read also: Kurnool: పత్తికొండ టమోటా మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి.. రైతుల కంటతడి