Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు జన్మభూమి.. ఇప్పుడు వాలంటీర్లు అంటూ.. ఎంపీ కేశినేని ఆసక్తికర వ్యాఖ్యలు

2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయవాడ పార్లమెంట్‌ నుంచి టీడీపీ తరఫున గెలిచారు ఎంపీ కేశినేని నాని. అయితే, ఇటీవల గత కొంతకాలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. కొద్ది రోజులుగా అతను

అప్పుడు జన్మభూమి.. ఇప్పుడు వాలంటీర్లు అంటూ.. ఎంపీ కేశినేని ఆసక్తికర వ్యాఖ్యలు
Mp Kesineni
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 12, 2023 | 1:44 PM

వాలంటీర్లపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. గతంలో జన్మభూమి కమిటీలు ఉంటే… ఇప్పుడు వాలంటీర్లు వచ్చారన్నారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదన్న ఆయన అందరినీ విమర్శించడం సరికాదన్నారు. ప్రతి రాజకీయ వ్యవస్థలో మంచి,చెడు రెండు ఉంటాయన్న అన్నారు. అంతేకాదు.. అధికారులైనా.., ఎంపీలు అయినా, వాలంటీర్లు అయినా పార్టీలకతీతంగా పనిచేయాలని సూచించారు. వాలంటీర్‌ వ్యవస్థ బాగుంటే కంటిన్యూ చేస్తామని చంద్రబాబు కూడా హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు కేశినేని నాని.

2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయవాడ పార్లమెంట్‌ నుంచి టీడీపీ తరఫున గెలిచారు ఎంపీ కేశినేని నాని. అయితే, ఇటీవల గత కొంతకాలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. కొద్ది రోజులుగా అతను తరచూ పార్టీ హైకమాండ్‌పై చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ పరంగా, రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..