Amit Shah: ఏపీపై బీజేపీ ఫుల్ ఫోకస్.. కర్నూలులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు డేట్ ఫిక్స్..
ఆంధ్రప్రదేశ్పై భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది. పార్టీని విస్తరించేందుకు ఇప్పటికే పలు వ్యూహాలను రచించి ముందుకుసాగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో
ఆంధ్రప్రదేశ్పై భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది. పార్టీని విస్తరించేందుకు ఇప్పటికే పలు వ్యూహాలను రచించి ముందుకుసాగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మార్కును చూపించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమత్రి అమిత్షా ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈనెల 8న కర్నూలు రానున్న అమిత్షా, అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు కర్నూలులో మకాం వేసిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. అమిత్షా టూర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పలువురు పార్టీ నేతలు సోమవారం కర్నూలులోని ఎస్ఏపీ క్యాంపు, ఎస్టీబీసీ కళాశాల మైదానం, డీఎస్ఏ మైదానాలను పరిశీలించారు. అనంతరం డీఎస్ఏ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు ప్రారంభించారు.
కాగా, అమిత్షా ఏపీ పర్యటన పొలిటికల్ టూర్గా తెలుస్తోంది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలులోనే కాకుండా మరో ఏరియాలో కూడా పర్యటించనున్నట్లు సమాచారం. అయితే, అమిత్షా టూర్కి సంబంధించి కంప్లీట్ డిటైల్స్ ఇంకా బయటికి రాలేదు.
కర్నూలుతోపాటు ఎక్కడెక్కడ పర్యటిస్తారు. అజెండా ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, కర్నూలులో ఓపెన్ మీటింగ్కి ఏర్పాట్లు జరుగుతుండటం, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పరిశీలించడంతో పొలిటికల్ టూర్గా టాక్ వినిపిస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..