AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Purandeswari: టీటీడీ ఛైర్మన్‌గా భూమన నియామకంపై పురంధేశ్వరి అభ్యంతరం.. హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్లనే..

గతంలో ఒకసారి టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన భూమన, ఆ అనుభవాన్ని ఇప్పుడు ఉపయోగిస్తానంటున్నారు. తిరుమల శ్రీవారికి ప్రథమ సేవకుడిగా, హిందూ ధర్మం వ్యాప్తి కోసం కృషిచేస్తానని చెబుతున్నారు టీటీడీ కొత్త ఛైర్మన్‌. అయితే, టీటీడీ ఛైర్మన్‌గా భూమనను నియమించడంపై అభ్యంతరం చెబుతున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. తిరుమల తిరుపతి దేవస్థానం.. రాజకీయ పునరావాసం కాకూడదన్నారామె

Purandeswari: టీటీడీ ఛైర్మన్‌గా భూమన నియామకంపై పురంధేశ్వరి అభ్యంతరం.. హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్లనే..
Daggubati Purandeswari
Basha Shek
|

Updated on: Aug 09, 2023 | 6:25 AM

Share

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్‌గా గురువారం (ఆగస్టు 10) బాధ్యతలు చేపట్టనున్నారు భూమన కరుణాకర్‌రెడ్డి. ప్రస్తుత ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో టీటీడీ పగ్గాలు అందుకోబోతున్నారు. గతంలో ఒకసారి టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన భూమన, ఆ అనుభవాన్ని ఇప్పుడు ఉపయోగిస్తానంటున్నారు. తిరుమల శ్రీవారికి ప్రథమ సేవకుడిగా, హిందూ ధర్మం వ్యాప్తి కోసం కృషిచేస్తానని చెబుతున్నారు టీటీడీ కొత్త ఛైర్మన్‌. అయితే, టీటీడీ ఛైర్మన్‌గా భూమనను నియమించడంపై అభ్యంతరం చెబుతున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. తిరుమల తిరుపతి దేవస్థానం… రాజకీయ పునరావాసం కాకూడదన్నారామె. అంతేకాదు, హిందూ ధర్మంపై నమ్మకమున్నోళ్లు మాత్రమే ఆ పదవికి న్యాయం చేయగలరంటూ ట్వీట్‌ చేశారు. హిందూ ధర్మాన్ని అనుసరించనివాళ్లను ఎలా టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు పురంధేశ్వరి. ‘తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కారాదు. హిందూ ధర్మం పై నమ్మకమున్నవాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరు. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం జరిగింది. ఈ విషయం పై గళం విప్పిన తరువాత 52 మంది నియామకాలను నిలిపివేశారు. అంటే ప్రభుత్వం ఈ నియామకాలను కూడా రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తున్నదని అర్ధమవుతున్నది. కనుక టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మం పై నమ్మకమున్న వారిని, హిందూ ధర్మం అనుసరించే వాళ్లని నియమించాలి’ అని ట్వి్ట్టర్‌లో రాసుకొచ్చారు పురంధేశ్వరి.

కాగా ప్రస్తుతం పురంధేశ్వరి వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న ఆమె వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్నారు. ఇటీవల టీవీ9 ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పోలవరం ప్రాజెక్టు జాప్యానికి టీడీపీతో పాటు వైసీపీ ప్రభుత్వాలు కారణమని దుయ్యబట్టారు. అలాగే ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీలు నాటకాలాడుతున్నాయని విమర్శించారు. అలాగే ప్రభుత్వ వైఖరి కారణంగానే ఏపీకి పెట్టుబడులు రావడం లేదని.. ఇక్కడి పరిస్థితులను చూసి ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..