TDPP Meeting: రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు కోసం రాజీలేని పోరాటం.. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయం

విశాఖ స్టీల్ ఫ్లాంట్ పోలవరం, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాల నిధులు అంశాలను పార్లమెంట్‌ సాక్షిగా ఉద్యమించాలని తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది.

TDPP Meeting: రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు కోసం రాజీలేని పోరాటం.. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయం
Tdp Parliamentary Party Meeting (file)
Follow us

|

Updated on: Jul 16, 2021 | 6:12 PM

TDP Parliamentary Party meeting: విశాఖ స్టీల్ ఫ్లాంట్ పోలవరం, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాల నిధులు అంశాలను పార్లమెంట్‌ సాక్షిగా ఉద్యమించాలని తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీ జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంత్ర హాజరైనారు. సుమారు 18 అంశాలపై పార్లమెంటరీ పార్టీ భేటీలో చర్చించారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, జల వివాదంపై ప్రధాన చర్చ జరిగింది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు హాజనై ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎంపీలు కనకమేడల రవీంద్ర, రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం అనేక పథకాలకు నిధులు ఇచ్చింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ఎంపీలు.. వ్యాక్సినేషన్‌ను దుర్వినియోగం చేసిందని తప్పుబట్టారు.

తెలంగాణ తో జగన్ అనుసరించిన మెతక వైఖరి వలన రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. సీఎం జగన్ సర్కార్ పోరాటం చేయకుండా..లేఖలతో సరిపెట్టారు. పార్లమెంట్‌లో అన్ని విషయాలు లేవనెత్తుతామని ఎంపీ రవీంద్ర తెలిపారు.

పోలవరం, ప్రత్యేక హోదా,వెనుకబడిన జిల్లాల నిధులు అంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పోరాటం చేస్తామన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా టీడీపీ అడ్డుకుందని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో సీఎం జగన్ తూతూ మంత్రంగా వ్యవహారిస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము రాజీనామా లకు సిద్ధంగా ఉన్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు కోసం టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.

Latest Articles
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే.!
ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే.!
కలలో పాము కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
కలలో పాము కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
'తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..'
'తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..'