AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: నేరస్తుల పాలన ఎలా ఉంటుందో కళ్లారా చూస్తున్నాం.. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీటా పీక్స్ కు చేరుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వైసీపీ నేతల తీరుపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల సహాయంతో కుప్పంలో...

Chandrababu: నేరస్తుల పాలన ఎలా ఉంటుందో కళ్లారా చూస్తున్నాం.. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
Chandrababu Naidu
Ganesh Mudavath
|

Updated on: Aug 26, 2022 | 3:16 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీటా పీక్స్ కు చేరుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వైసీపీ నేతల తీరుపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల సహాయంతో కుప్పంలో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంపై వైసీపీ లీడర్స్ పగబట్టి, దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కుప్పంలో 650 ఇళ్లతో మోడల్‌ కాలనీ నిర్మించామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఆగిపోయిందని చెప్పారు. రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని ఆపేస్తున్నారని విమర్శించారు. కుప్పం చరిత్రలో నిన్న జరిగింది చీకటి రోజన్న చంద్రబాబు.. నేరస్తుల పాలన ఎలా ఉంటుందో కళ్లారా చూస్తున్నామని ద్వజమెత్తారు. కుప్పంపై వైసీపీ నేతలకు ఎందుకంత కోపమని ప్రశ్నించారు. పేదవాళ్ల ఆకలి కష్టాలు తీర్చాలని ఏర్పాటు చేసుకున్న అన్న క్యాంటీన్లను ఎందుకు ధ్వంసం చేస్తున్నారని నిలదీశారు. నిన్న జరిగిన అల్లర్ల కారణంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత పెంచారు. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 6+6 కమాండోలతో ఉన్న భద్రతను 12+12 కమాండోలకు పెంచింది. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు.

పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. సదుద్దేశంతో తీసుకువచ్చిన ఈ కార్యక్రమం తమిళనాడులో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్‌ ను సీఎం స్టాలిన్‌ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నేను పులివెందులను అభివృద్ధి చేసి, గండికోట నుంచి నీళ్లిచ్చాను. కానీ వైసీపీ పాలనలో మాత్రం కుప్పం పై రాజకీయంగా కక్ష గట్టారు. ఏ విధంగా నాశనం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో వచ్చి అభివృద్ధి చేయకుండా గడప గడపకు తిరుగుతూ కాలయాపన చేస్తున్నారు.

– చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్సీ భరత్‌ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.. అన్న క్యాంటీన్‌ వద్ద ఎందుకు ఏర్పాటు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇలా వ్యవహరించి ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి బయట తరిగే వాడా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?