Rare Bird : త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో వింత ఆకారంలో పక్షి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..

ప్రకాశం జిల్లాలో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. త్రిపురాంతకం లోని త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో వింత ఆకారంలో గల పక్షి..

Rare Bird : త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో వింత ఆకారంలో పక్షి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..
Follow us

|

Updated on: Mar 03, 2021 | 2:56 PM

Rare Bird : ప్రకాశం జిల్లాలో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. త్రిపురాంతకం లోని త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో వింత ఆకారంలో గల పక్షి సందడి చేసింది. మంగళవారం ఉదయం ఆలయం ఆవరణలో సిబ్బంది శుభ్రం చేస్తుండగా దర్శనిమిచ్చింది. ఈ పక్షి ఆకారం చూడడానికి వింతగా ఉందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు.. దీనిని పాల పక్షిగా పిలుస్తుంటారని.. ఇది ఏటా ప్రతి మహాశివరాత్రి ముందు ఆలయం ఆవరణలో దర్శన మిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ పక్షికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పక్షులు తరచూ కనిపిస్తున్నాయి. భద్రాచలం రాములవారి ఆలయంలో కూడా ఈ పక్షి ప్రత్యక్షమైంది. వింత ఆకారంలో ఉండటంతో భక్తులు దాన్ని చూసి సెల్పీలు తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి పక్షి త్రిపురాంతకంలో కనిపించింది.

మరిన్ని ఇక్కడ చదవండి 

Vikarabad lady murder : వికారాబాద్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మర్డర్, ప్రియురాల్ని గొంతుకోసి చంపిన ప్రియుడు Friendship : ఆకట్టుకుంటున్న ‘ఫ్రెండ్ షిప్’ మూవీ టీజర్.. బజ్జీకి ఆల్ ది బెస్ట్ తెలిపిన ఫ్రెండ్స్..

Kumbh Mela 2021: కోవిడ్ నిబంధనలతో కుంభ‌మేళా.. ఏప్రిల్ 1న ప్రారంభం కానున్న ఉత్సవాలు