Visakhapatnam: బీచ్ కు వచ్చే ప్రేమ జంటలే టార్గెట్.. లక్షల్లో డబ్బులు వసూలు.. నకిలీ పోలీస్ కేసులో షాకింగ్ విషయాలు..

విశాఖ బీచ్ లో ప్రేమికులను బెదిరించి.. డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఋషికొండ ప్రాంతంలో ఓ జంటను.. సునీల్ అనే వ్యక్తి తాను పోలీసునంటూ బెదిరించాడు. విషయం ఎవరికీ..

Visakhapatnam: బీచ్ కు వచ్చే ప్రేమ జంటలే టార్గెట్.. లక్షల్లో డబ్బులు వసూలు.. నకిలీ పోలీస్ కేసులో షాకింగ్ విషయాలు..
Arrest
Follow us

|

Updated on: Jan 23, 2023 | 9:39 AM

విశాఖ బీచ్ లో ప్రేమికులను బెదిరించి.. డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఋషికొండ ప్రాంతంలో ఓ జంటను.. సునీల్ అనే వ్యక్తి తాను పోలీసునంటూ బెదిరించాడు. విషయం ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తమ దగ్గర డబ్బు లేదని, వదిలేయాలని ప్రాధేయపడినా సునీల్ కనికరించలేదు. డబ్బులు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తానడంతో ఆ జంట భయపడిపోయారు. అంతటితో ఆగకుండా ఆ నకిలీ పోలీస్ వారి వద్ద ఉన్న ఎనిమిది వేల రూపాయలు లాక్కున్నాడు. విషయం ఎవరికైనా చెబితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు. సముద్ర తీర ప్రాంతాల్లో ప్రేమికులను బెదిరించి ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేస్తున్నట్లు డయల్‌ 100కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆరిలోవ పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు నిందితుడిని అప్పగించారు. ఈ విషయాన్ని పోలీసులకు వివరించారు.

వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నకిలీ పోలీసును అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై సీపీ శ్రీకాంత్ సీరియస్ గా దృష్టి సాలించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఆ నకిలి పోలీస్ సునీల్ కు మరో ఏ ఆర్ కానిస్టేబుల్ సహకారం అందిస్తున్నట్టు ప్రాథమికంగా తెలుసుకున్నారు. ఏ ఆర్ కానిస్టేబుల్ పాత్ర పై ఆరా తీస్తున్నారు. తాను పోలీసునంటూ జంటల నుంచి వసూళ్లు, బెదిరింపులకు పాల్పడుతున్న సునీల్ ను ఆరా తీయగా.. పోలీసులు కీలక విషయాలు తెలుసుకున్నారు. నగదు లేకపోతే డిజిటల్ పేమెంట్ ల ద్వారా వసూళ్లు చేసేవారని, వసూలు చేసిన మొత్తాన్ని సునీల్, సంతోష్ వాటాలు వేసుకుంటున్నట్టు ప్రాథమిక నిర్ధారించారు.

టాస్క్‌ఫోర్స్‌ విచారణలో దీన్ని నడిపిస్తున్నది దిశ వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌గా తెలిసింది. సునీల్ వేసుకుంటున్న ఖాకీ ప్యాంటు కూడా ఏఆర్‌ కానిస్టేబుల్‌దే కావడం గమనార్హం. వారి ఫోన్లు పరిశీలిస్తే రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..