AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elephants: తిరుమలలో మళ్లీ ఏనుగుల కలకలం.. గజరాజుల దాడిలో రైతు మృతి

తిరుమలలో మళ్లీ ఏనుగుల (Elephants) గుంపు కలకలం సృష్టిస్తోంది. గత కొన్నిరోజులుగా ఏనుగుల మంద పాపవినాశనం(Papavinashanam) రోడ్డులో సంచరిస్తున్నాయి. పాపవినాశనంలోని పార్వేట మండపం వద్ద తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు..

Elephants: తిరుమలలో మళ్లీ ఏనుగుల కలకలం.. గజరాజుల దాడిలో రైతు మృతి
Elephant In Tirumala
Ganesh Mudavath
|

Updated on: Mar 31, 2022 | 3:08 PM

Share

తిరుమలలో మళ్లీ ఏనుగుల (Elephants) గుంపు కలకలం సృష్టిస్తోంది. గత కొన్నిరోజులుగా ఏనుగుల మంద పాపవినాశనం(Papavinashanam) రోడ్డులో సంచరిస్తున్నాయి. పాపవినాశనంలోని పార్వేట మండపం వద్ద తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు.. వాహనదారులను వెంబడించాయి. దీంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగులను అడవిలోకి తిరిగి పంపించేందుకు టీటీడీ(TTD) సిబ్బంది చర్యలు చేపట్టారు. ఏనుగులు తిరుమల వైపు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. గత ఫిబ్రవరిలోనూ తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు సంచరించింది. ఘాట్‌రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల మంద రోడ్డు దాటింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ అటవీశాఖ సిబ్బంది ఆ గుంపును ఫారెస్ట్‌లోకి మళ్లించారు.

మరోవైపు ఏనుగుల దాడిలో ఓ రైతు మృతి చెందాడు. చిత్తూరు జిల్లా సదుం మండలంలోని జోగివారిపల్లె అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. రైతు ఎల్లప్ప తోట వద్ద నిద్రిస్తుండగా అతనిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో ఎల్లప్ప తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read

KGF 2 Trailer: కేజీఎఫ్‌ రికార్డుల వేట అప్పుడే మొదలైంది.. ట్రైలర్‌కు ఒక్క రోజులో ఎన్ని వ్యూస్‌ వచ్చాయో తెలుసా.?

Castrol Super Mechanic Contest: తుది అంకానికి చేరుకున్న క్యాస్ట్రోల్‌ సూపర్‌ మెకానిక్‌ కాంటెస్ట్‌.. గ్రాండ్‌ఫినాలేకు 50 మంది ..

Imran Khan: పాక్‌లో అనూహ్యంగా మారుతున్న పరిణామాలు.. ఇమ్రాన్‌కు మొదలైన గడ్డుకాలం..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం