AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. అందుబాటులోకి మరో వందే భారత్ ట్రైన్.. ఇక పండుగే

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. నర్సాపురం నుంచి చెన్నైకు వందే భారత్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఈ రైలు విజయవాడ టూ చెన్నై నడిచేది. కానీ ఇప్పుడు నర్సాపురం వరకు పొడిగించారు. తాజాగా దీని టైమ్ షెడ్యూల్ విడుదలైంది.

Vande Bharat Express: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. అందుబాటులోకి మరో వందే భారత్ ట్రైన్.. ఇక పండుగే
Vande Bharat 2
Venkatrao Lella
|

Updated on: Dec 10, 2025 | 7:52 PM

Share

ఏపీ ప్రజలకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ తెలిపింది. విజయవాడ-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో పలు మార్పులు చేస్తోంది. ఈ ట్రైన్ ఇప్పటివరకు విజయవాడ నుంచి చెన్నై వరకు మాత్రమే సర్వీసులు అందిస్తుండగా.. ఇప్పుడు దానికి పొడిగించారు. ఇది నర్సాపురం నుంచి చెన్నై వరకు సేవలు అందించనుంది. డిసెంబర్ 15 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీనికి తగ్గట్లు రైల్వేశాఖ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. నర్సాపురం ఎంపీ, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు వివరాలను ట్వీట్ చేశారు. ఆ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ నెల 15వ తేదీ నుంచి నర్సాపురం-చెన్నై వందే భారత్ రైలు నర్సాపురంలో సాయంత్రం 2.50 నిమిషాలకు బయల్దేరుతుంది. భీవవరంకు 3.19 నిమిషాలకు, గుడివాడకు 4.04కు, విజయవాడకు 4.50 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక తెనాలికి 5.19 గంటలకు, ఒంగోలుకు 6.29 గంటలకు, నెల్లూరుకు 07.39 గంటలకు, గూడురుకు 8.49 గంటలకు, రేణిగుంటకు 9.54కు, చెన్నైకు 11.45 గంటలకు చేరుకుంటుందని రైల్వేశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.

నర్సాపురం వరకు వందే భారత్ ట్రైన్‌ను పొడిగించాలని ప్రజలను నుంచి డిమాండ్లు వినిపించాయి. ఇవి కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో ఆయన చొరవ తీసుకున్నారు. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రైల్వేశాఖ నర్సాపురం వరకు సర్వీసులు పొడిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వేశాఖ నుంచి ఎప్పుడో అనుమతి రాగా.. ఇది ఎప్పటినుంచి సర్వీసులు అందిస్తుందనే దానిపై క్లారిటీ రాకపోవడంతో స్థానికులు ఎదురుచూస్తు్న్నారు. ఇప్పుడు ఎట్టకేలకు షెడ్యూల్ రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా కేంద్రమంత్రి చొరవతో ఇప్పటికే పలు రైళ్లకు కొత్తగా నర్సాపురంలో హాల్ట్ సౌకర్యం కల్పించారు.,

ఏపీ ప్రజల కోసం మరో వందే భారత్ ట్రైన్.. షెడ్యూల్ రిలీజ్
ఏపీ ప్రజల కోసం మరో వందే భారత్ ట్రైన్.. షెడ్యూల్ రిలీజ్
"ఇండస్ట్రీలో అబ్బాయిలను కూడా కమిట్‌మెంట్ అడుగుతారు"
గుడ్లను ఫ్రిజ్‌లో పెడితే పాడవుతాయా.. పుకార్లు కాదు వాస్తవాలు..
గుడ్లను ఫ్రిజ్‌లో పెడితే పాడవుతాయా.. పుకార్లు కాదు వాస్తవాలు..
తెలంగాణలోనూ 'అఖండ 2' సినిమా టిక్కెట్‌ ధరలు భారీగా పెంపు..
తెలంగాణలోనూ 'అఖండ 2' సినిమా టిక్కెట్‌ ధరలు భారీగా పెంపు..
ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?
ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?
'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'
'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'
కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..
కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..
మీరు వాడే నెయ్యి స్వచ్ఛతపై అనుమానం ఉందా.? ఇలా చెయ్యండి..
మీరు వాడే నెయ్యి స్వచ్ఛతపై అనుమానం ఉందా.? ఇలా చెయ్యండి..
అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు
అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు
75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..
75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..