AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 నిమిషాల చిట్కాతో పిల్లల్లో బోర్డ్‌ ఎగ్జామ్స్ టెన్షన్‌ మాయం! జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతం

బోర్డ్ ఎగ్జామ్స్ అంటే కేవలం జ్ఞాపకశక్తికి మాత్రమే కాదు, అది విద్యార్థుల మానసిక నియంత్రణకు కూడా ఒక పెద్ద పరీక్ష. పరీక్షల సమయం దగ్గరపడుతున్న కొద్దీ చాలామంది పిల్లలు చదువుకోవడం మానేసి, కేవలం ఆ ఒత్తిడి నుండి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తుంటారు.

6 నిమిషాల చిట్కాతో పిల్లల్లో బోర్డ్‌ ఎగ్జామ్స్ టెన్షన్‌ మాయం! జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతం
Student Stress Relief Tips.jpg
Nikhil
|

Updated on: Feb 19, 2026 | 9:44 PM

Share

ఈ ఆందోళన వారి శరీరంలో మార్పుల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. వేగంగా ఊపిరి తీసుకోవడం, దవడలు బిగబట్టడం, భుజాలు పట్టేయడం, కాళ్లలో వణుకు.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే వారి మెదడు నేర్చుకునే స్థితి నుండి భయాందోళనలోకి వెళ్ళిపోయిందని అర్థం. ఇలాంటప్పుడు ఎంత బాగా చదివిన పిల్లలైనా పరీక్షా హాల్ లో అంతా మర్చిపోయినట్లు అనిపిస్తుంది.

పరీక్షల వేళ పిల్లల కంటే తల్లిదండ్రులకే ఎక్కువ ఆందోళన కనిపిస్తుంటుంది. అయితే, ఆందోళన అనేది వ్యక్తిత్వ లోపం కాదు, అది మన నాడీ వ్యవస్థలో వచ్చే మార్పు అని బెంగళూరుకు చెందిన సోమాటిక్ ప్రాక్టీషనర్ అద్విత్ సహదేవ్ వివరించారు. శరీరం ఎప్పుడూ అలర్ట్ మోడ్ లో ఉండటం వల్ల మెదడు నేర్చుకున్న విషయాలను గుర్తుకు తెచ్చుకోలేకపోతుంది. దీనిని అధిగమించడానికి ఇంట్లోనే పాటించదగ్గ ఒక సులభమైన ఆరు నిమిషాల దినచర్యను ఆయన సూచించారు. రోజుకు రెండుసార్లు ఈ పద్ధతిని పాటిస్తే పిల్లల్లో అద్భుతమైన మార్పు వస్తుంది.

  •  పిల్లలను రెండు పాదాలను నేలపై సమాంతరంగా ఉంచి కూర్చోమని చెప్పాలి. వారి కళ్లతో నెమ్మదిగా ఎడమ నుండి కుడికి చూస్తూ, ఆరుసార్లు దీర్ఘంగా శ్వాస వదలమని చెప్పాలి. ఇది నాడీ వ్యవస్థను శాంతపరిచి, శ్వాసకు మరియు హృదయ స్పందనకు మధ్య సమన్వయాన్ని పెంచుతుంది.
  • పిల్లలతో చేతులు, కాళ్లను వేగంగా ఆడించమని చెప్పాలి. ఆ తర్వాత 10 సెకన్ల పాటు గోడను బలంగా నెట్టమని సూచించాలి. ఈ సమయంలో వారు ఆవులించడం లేదా దీర్ఘంగా నిట్టూర్పు వదలడం చేస్తే, వారి శరీరం నుండి అధిక ఒత్తిడి విడుదలవుతున్నట్లు అర్థం.
  • గొంతు కింద ఉండే ఎముకలు, గుండె పక్కన, వెన్నెముక కింది భాగం వద్ద నెమ్మదిగా చేతులతో తాకమని చెప్పాలి. ఎనిమిది (8) అంకె ఆకారంలో దృష్టిని నెమ్మదిగా మళ్ళించడం వల్ల శరీరం మళ్ళీ స్థిరత్వాన్ని పొందుతుంది. దీనివల్ల మెదడు మళ్ళీ చురుగ్గా పని చేయడం ప్రారంభిస్తుంది.
  • పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు తమ మాటతీరును మార్చుకోవాలి. “ఇంకా ఎంత చదవాల్సి ఉంది?” అని పదే పదే ప్రశ్నించడం వల్ల వారిలో ఆందోళన పెరుగుతుంది. దానికి బదులుగా “తర్వాతి చిన్న అడుగు ఏంటి?” అని అడగడం అలవాటు చేసుకోవాలి. ఫలితం కంటే వారు పడుతున్న శ్రమను గుర్తించి అభినందించాలి.
  • నిరంతరం గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చోబెట్టడం కంటే, 25 నిమిషాల ఏకాగ్రతతో కూడిన చదువు తర్వాత ఐదు నిమిషాల విరామం ఇవ్వడం మంచిది. ఈ విరామ సమయంలో ఫోన్ వాడకుండా, కాసేపు అటు ఇటు నడవడం వంటివి చేయాలి.
  • సిలబస్ పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, పిల్లల మానసిక స్థితిని నియంత్రణలో ఉంచడం కూడా అంతే ముఖ్యం. శరీరం భయం నుండి బయటపడినప్పుడు జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Follow Us