Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రజా విజయం.. రాష్ట్రానికి శుభసూచకం.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన గ్రాడ్యుయేట్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి...

Andhra Pradesh: ప్రజా విజయం.. రాష్ట్రానికి శుభసూచకం.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు..
Tdp
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 18, 2023 | 9:36 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన  పార్టీ అభ్యర్థులకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విటర్‌ వేదికగా అభినందించారు. వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు,నాయకులకు సెల్యూట్ అంటూనే.. ఈ ఫలితాలు ప్రజావిజయం, మార్పుకు సంకేతమని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల తీర్పు.. మంచికి మార్గం, రాష్ట్రానికి శుభసూచకమన్నారు.  ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన గ్రాడ్యుయేట్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి శాసన మండలికి వెళుతున్న వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడాలని కోరుతున్నట్లు తెలిపారు. అలాగే వారికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అండగా ఉంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే రెండింటిని కైవసం చేసుకున్న తెదేపా.. మూడో స్థానంలో కూడా విజయం సాధించింది.  ఉత్కంఠభరితంగా సాగిన పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ(కడప – అనంతపురము – కర్నూలు) ఎమ్మెల్సీగా..  వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డిపై 7543 ఓట్ల మెజారీటీతో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామభూపాలరెడ్డి గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ రాకపోవడంతో, అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు.

అలాగే అంతకముందు తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌, ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు భారీ విజయం సాధించారు.  దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగిన 3 చోట్ల కూడా.. ఆయా స్థానాలు టీడీపీ సొంతమయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేసులు లేకుంటే వేస్ట్.. లీడర్‌పై కేసులు మస్ట్!
కేసులు లేకుంటే వేస్ట్.. లీడర్‌పై కేసులు మస్ట్!
ప్రసాదం కోసం మాత్రమే ఆలయంలోకి వచ్చిన ఈ భక్తులు ఎవరంటే..?
ప్రసాదం కోసం మాత్రమే ఆలయంలోకి వచ్చిన ఈ భక్తులు ఎవరంటే..?
మీ ముఖాన్ని ‘ఏఐ’ దొంగిలిస్తోందా?ఘిబ్లీ ఆర్ట్‌పై తెలుసుకోవాల్సిందే
మీ ముఖాన్ని ‘ఏఐ’ దొంగిలిస్తోందా?ఘిబ్లీ ఆర్ట్‌పై తెలుసుకోవాల్సిందే
గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే ఎన్నిఆరోగ్య ప్రయోజనాలో తెలుసా
గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే ఎన్నిఆరోగ్య ప్రయోజనాలో తెలుసా
రాత్రి పూట ముళ్ల పొదల్లో నుంచి వింత శబ్ధాలు!
రాత్రి పూట ముళ్ల పొదల్లో నుంచి వింత శబ్ధాలు!
ఏప్రిల్‌లో స్మార్ట్ ఫోన్ల జాతర..కొత్తగా విడుదల కానున్న ఫోన్లు ఇవే
ఏప్రిల్‌లో స్మార్ట్ ఫోన్ల జాతర..కొత్తగా విడుదల కానున్న ఫోన్లు ఇవే
కంచ గచ్చిబౌలి భూములపై సమగ్ర నివేదికను సమర్పించండి.. కేంద్రం లేఖ..
కంచ గచ్చిబౌలి భూములపై సమగ్ర నివేదికను సమర్పించండి.. కేంద్రం లేఖ..
ఆదిత్య 369 రీ రిలీజ్.. హీరోయిన్ మోహినీ ఇప్పుడెలా ఉందో చూశారా?
ఆదిత్య 369 రీ రిలీజ్.. హీరోయిన్ మోహినీ ఇప్పుడెలా ఉందో చూశారా?
జట్టు మారనున్న జైస్వాల్‌! ఎందుకంటే..?
జట్టు మారనున్న జైస్వాల్‌! ఎందుకంటే..?
ఈ నైపుణ్యాలుంటే కోరినంత జీతం..క్యూ కడుతున్న టాప్ కంపెనీలు
ఈ నైపుణ్యాలుంటే కోరినంత జీతం..క్యూ కడుతున్న టాప్ కంపెనీలు