AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చనిపోయిందనుకొని తల్లికి రెండేళ్ల క్రితం కర్మకాండలు..యూట్యూబ్‌లో ప్రత్యక్షమయ్యే సరికి..

Andhra Pradesh News: రెండేళ్ల పాటు కనిపించకుండా పోయిన.. ఆ మహిళ మరణించిందని భావించిన కుటుంబసభ్యులు కర్మకాండలను సైతం జరిపించారు. ఓ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సమయంలో ఓ అనాథాశ్రమంలో తన తల్లి కనిపించడంతో ఆనందానికి గురైన ఆమె కుమారుడు.. ఎట్టకేలను తల్లిని ఇంటికి చేర్చుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది.

Andhra Pradesh: చనిపోయిందనుకొని తల్లికి రెండేళ్ల క్రితం కర్మకాండలు..యూట్యూబ్‌లో ప్రత్యక్షమయ్యే సరికి..
Orphanage Home
M Sivakumar
| Edited By: |

Updated on: Jul 24, 2023 | 3:59 PM

Share

ఎన్టీఆర్ జిల్లా, జులై 24: రెండేళ్ల పాటు కనిపించకుండా పోయిన.. ఆ మహిళ మరణించిందని భావించిన కుటుంబసభ్యులు కర్మకాండలను సైతం జరిపించారు. ఓ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సమయంలో ఓ అనాథాశ్రమంలో తన తల్లి కనిపించడంతో ఆనందానికి గురైన ఆమె కుమారుడు.. ఎట్టకేలను తల్లిని ఇంటికి చేర్చుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా పుల్లూరు మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ, తిరుపతయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగేంద్రమ్మకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో రెండు సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆమె కనిపించకపోవడంతో అవకాశం ఉన్న ప్రతిచోట నాగేంద్రమ్మ కోసం గాలించారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. అదే సమయంలో సమీప ప్రాంతంలోని ఓ కొండమీద ఒక మహిళ హత్యకు గురైంది. దీంతో హత్యకు గురైన మహిళను నాగేంద్రమ్మగా భావంచిన కుటుంబ సభ్యులు ఆమె కర్మకాండలను కూడా జరిపించారు.

యూట్యూబ్‌లో చూసి..

నాగేంద్రమ్మ తప్పిపోయిన రెండేళ్ల తర్వాత ఆమె కుమారుడు ఓయూట్యూబ్ ఛానల్ వీక్షిస్తుండగా.. విజయవాడ పట్టణానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు తన యూల్యూబ్ ఛానల్ లో ప్రసారం చేసిన వీడియో వారి కుటుంబ సభ్యులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ వీడియోలో తన కన్నతల్లిని గుర్తించిన కుమారుడు.. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్కే ఫౌండేషన్ అడ్రస్ తెలుసుకుని.. తల్లి నాగేంద్రమ్మను కలుసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో నాగేంద్రమ్మకు చెందిన ఆధారాలను చూపించి.. తమకు అప్పగించాలని వేడుకున్నారు. నాగేంద్రమ్మ తప్పిపోయిన సమయంలో ఏం జరిగిందనే విషయాలు సదరు ఆశ్రమ నిర్వాహకులు వివరించారు. ఆశ్రమానికి వెళ్లిన తర్వాత నాగేంద్రమ్మ తన పేరు కూడా చెప్పకపోవడంతో ఆమెను స్వర్ణ అని పిలిచేవారు. అలా రెండేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న నాగేంద్రమ్మను.. తాజాగా కుటుంబ సభ్యులు పోలీస్ వారి సహకారంతో ట్రైనీ ఐపీఎస్ అవినాష్ కుమార్ నేతృత్వంలో కేసు పూర్వాపరాలు పరిశీలించి సదర మహిళను వారి బంధువుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. 

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే