AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain warnings: అల్పపీడనం కారణంగా ఆకాశం మేఘావృతం, రాత్రి నుండి చిరుజల్లులు,హెచ్చరికలు

పశ్చిమ-మధ్య బంగాళాఖాతం.. ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర తీరంలో గల అల్పపీడనం బలపడుతోంది. దానితో పాటు అల్పపీడనానికి

Rain warnings: అల్పపీడనం కారణంగా ఆకాశం మేఘావృతం, రాత్రి నుండి చిరుజల్లులు,హెచ్చరికలు
Rain Alert
Venkata Narayana
|

Updated on: Oct 16, 2021 | 8:04 AM

Share

Telugu States Weather Report: పశ్చిమ-మధ్య బంగాళాఖాతం.. ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర తీరంలో గల అల్పపీడనం బలపడుతోంది. దానితో పాటు అల్పపీడనానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్రమట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు ఉండి ఎత్తులో నైరుతి దిశకు వంగి ఉంది. దీని ప్రభావంతో, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో 15 అక్టోబర్ నుండి 16 అక్టోబర్ 2021 వరకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

తూర్పు పశ్చిమ ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఇంకా 5.8 కి.మీ.ల మధ్య ఎత్తులో ఉంది. ఇది దక్షిణ ద్వీపకల్ప భారతదేశం అంతటా సుమారు 14 ° N అక్షాశంము వద్ద కొనసాగుతోంది. వీటి ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమైంది. ముఖ్యంగా విశాఖ జిల్లాపై అల్పపీడన ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అల్పపీడనం కారణంగా జిల్లాలో రాత్రి నుండి చిరుజల్లులు కురుస్తున్నాయి.

ఇక, విశాఖ జిల్లాలో నేడు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం.. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకి వెల్లొద్ధ౦టూ హెచ్చరికలు జారీ చేశారు.

Read also: Andhra and Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..