Pawan Kalyan: జనసైనికుడికి పవన్‌ కళ్యాణ్‌ గిఫ్ట్‌.. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కార్యకర్త వినూత్న కార్యక్రమం

జనసేనాని పిలుపుతో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన కార్యకర్తలు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతని ఆలోచనకు మెచ్చిన జనసేనాని అతనికి బహుమతి ఇచ్చి ప్రోత్సహించారు.

Pawan Kalyan: జనసైనికుడికి పవన్‌ కళ్యాణ్‌ గిఫ్ట్‌.. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కార్యకర్త వినూత్న కార్యక్రమం
Pawan Kalyan Janavani
Follow us

|

Updated on: Jan 31, 2023 | 12:48 PM

రాజకీయాల్లో మార్పులు రావాలంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి .. జీరో బడ్జెట్ పాలసీతో ప్రజలకు రాజకీయాలను చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. రానున్న ఎన్నికలపై పూర్తి స్తాయిలో దృష్టి పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య ప్రజల కోసం ప్రజల సమస్యలపై తనదైన శైలిలో పోటాడుతున్నారు. తమ అధినేత పిలుపు మేరకు జనసేన నేతలు, కార్యకర్తలు పవన్ బాటలో నడుస్తూ.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. జనసేనాని పిలుపుతో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన కార్యకర్తలు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతని ఆలోచనకు మెచ్చిన జనసేనాని అతనికి బహుమతి ఇచ్చి ప్రోత్సహించారు.

పల్నాడు జిల్లాకు చెందిన బాలాజీ అనే జనసైనికుడిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం స్ఫూర్తితో పల్నాడు ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకుని, ఆ సమస్యలను అధినేత దృష్టికి తీసుకురావాలని వినూత్న కార్యక్రమం చేపట్టారు బాలాజీ. ఈ నేపథ్యంలో తన బైక్ పై ‘పల్నాడు ప్రజా సమస్యల పెట్టె’ పేరుతో ఓ పెట్టెను ఏర్పాటు చేసుకుని, పల్నాడు ప్రాంతంలో గ్రామ గ్రామాన తిరుగుతూ, ప్రజాసమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నారు. వాటిని పవన్ కు అందజేసేందుకు సొంతంగా కార్యాచరణ అమలు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

బాలాజీ ఆలోచనను మెచ్చుకున్న పవన్ కల్యాణ్‌…. బాలాజీకి ఓ మొబైల్ ఫోన్, ప్రోత్సాహక నగదు అందజేశారు. పవన్ ఆ కార్యకర్తతో ముచ్చటించి, అతడిలో ఉత్సాహం నింపారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..