AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంకు లాకర్లలో ఉన్న బంగారం ఏమైంది.. వెలుగులోకి మహా మోసం.. కస్టమర్లకు అసలు విషయం తెలిసి..

కాకినాడలో మరో బ్యాంక్ మోసం వెలుగు చూసింది. సూర్యారావుపేట యూకో బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ గోల్డ్ లోన్ మోసం వెలుగు చూసింది. బ్యాంక్ అధికారులు లాకర్ తనిఖీల్లో లేటుగా గుర్తించారు.

బ్యాంకు లాకర్లలో ఉన్న బంగారం ఏమైంది.. వెలుగులోకి మహా మోసం.. కస్టమర్లకు అసలు విషయం తెలిసి..
Gold
Shaik Madar Saheb
|

Updated on: Jan 31, 2023 | 11:40 AM

Share

కాకినాడలో మరో బ్యాంక్ మోసం వెలుగు చూసింది. సూర్యారావుపేట యూకో బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ గోల్డ్ లోన్ మోసం వెలుగు చూసింది. బ్యాంక్ అధికారులు లాకర్ తనిఖీల్లో లేటుగా గుర్తించారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన కంప్లైంట్‌పై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో బ్యాంక్ అధికారుల పాత్రపై పోలీసులు విచారిస్తున్నారు. కస్టడీ పిటిషన్ వేసి ముద్దాయిల నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి సిద్ధం అవుతున్నారు. అప్రైజర్ శ్రీనివాస్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. 30 మంది పేర్లపై 60 సార్లు 8 కేజీల 316 గ్రాములు బంగారం తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. దాని విలువ దాదాపు 2 కోట్ల 50 లక్షల రూపాయలుగా అంచనా వేశారు.

నకిలీ బంగారం బ్యాంక్‌లో పెట్టి సొమ్ములు నొక్కేశారు కేటుగాళ్లు శ్రీనివాస్, రాంబాబు, కొండరాజు. నిందితుల నుంచి ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు యత్నిస్తున్నారు. దాదాపు ఏడాది న్నరగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తేలింది. తెలిసిన వారిని నకిలీ బంగారం తీసుకురమ్మని దానిని చెక్ చేసి ఒరిజినల్‌గా నిర్దారించినట్లు తేలింది. ఇందులో పాత్రదారులుగా గమనించిన పోలీసులు.. 30 మందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్‌లను పరిశీలిస్తున్నారు.

ఏ విధంగా ఫ్రాడ్ జరిగిందని తేల్చేందుకు బ్యాంక్‌లో ఉన్న మొత్తం బంగారం పరిశీలించనున్నారు. మరోవైపు అప్రైజర్ మోసం వెలుగుచూడటంతో బ్యాంక్ కస్టమర్స్ ఆందోళన చెందుతున్నారు. లాకర్‌లో పెట్టుకున్న తమ బంగారం పరిస్థితి ఏంటని చెక్ చేసుకుంటున్నారు. డబ్బులు పూర్తిగా చెల్లిస్తేనే బంగారం చూపిస్తామని అధికారులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

జనం మాత్రం అసలు బంగారం ఉందో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్‌ నుంచి తీసుకెళ్లిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఏ విధంగా రికవరీ చేయాలనే లెక్కలు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మొత్తానికి యూకో బ్యాంక్‌ను, కస్టమర్స్‌ని బురిడీ కొట్టించాడు గోల్డ్ అప్రైజర్ శ్రీనివాస్.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Follow Us