కలర్ ఫుల్‌వి కాదండోయ్.. మీ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలో తెలుసా?

Samatha

18 August 2026

రాఖీ పండుగ వచ్చేస్తుంది. 2026 ఆగస్టు 28 శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు.

హిందూ సంప్రదాయంలో రక్షా బంధన్ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసం పౌర్ణమి తిథి రోజు ఈ వేడుక జరుపుకుంటారు.

ఇక ఈ పండుగ రోజు సోదరీమణులు, తమ సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు.

అయితే ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాలైన రంగు రంగుల రాఖీలు వస్తున్నాయి. కానీ శాస్త్రం ప్రకారం ఏ రంగు రాఖీలు కట్టాలో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పుడూ కూడా డిజైన్ రాఖీలను కట్టకూడదంట. ముందుగా పసుపు, కుంకుమ రాసి వాటిపై అక్షింతలు వేసిన రాఖీలు కట్టాలంట.

ఆ తర్వాత రంగు రంగుల రాఖీలు, మీకు ఇష్టమైనవి కట్టాలని చెబుతున్నారు పండితులు. దీని వలన అదృష్టం కలిసి వస్తుందంట.

శాస్త్రం ప్రకారం ఇలా పసుపు, కుంకుమ కలిపి కట్టిన రాఖీ కట్టడం వలన సోదరుడికి అన్నివిధాలుగా కలిసిరావడమే కాకుండా విజయం దక్కతుందంట.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని గమనించాలి.