AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇవాళ అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్న సీఎం జగన్‌..

Jagananna Videshi Vidya Deevena: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి శుభవార్త. ఇవాళ (జులై 27) ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్. అర్హులైన 357 మంది విద్యార్థులకు 45.53 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి.

CM Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇవాళ అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్న సీఎం జగన్‌..
Cm Jagan
Basha Shek
|

Updated on: Jul 27, 2023 | 6:59 AM

Share

Jagananna Videshi Vidya Deevena: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి శుభవార్త. ఇవాళ (జులై 27) ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్. అర్హులైన 357 మంది విద్యార్థులకు 45.53 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి. గడచిన 6 నెలల్లో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ప్రభుత్వం 65.48 కోట్లు విడుదల చేసింది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్-50 ర్యాంక్లు సాధించిన కళాశాలల్లో ప్రవేశం పొందిన ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయనుంది. ఈ పథకంతో ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువు కునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు సీఎం జగన్.

అలాగే ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం లోపు ఉన్నవారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. కాగా గురువారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.45.53 కోట్లు జమ చేయనున్నారు సీఎం జగన్‌. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం సహాయం, ఫిర్యాదుల కోసం 1902 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..