AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. పెరిగిన వైసీపీ ఓటు బ్యాంక్.. రాష్ట్రవ్యాప్తంగా అదే జగన్ వేవ్

రోజుల వ్యవధిలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దుమ్ము రేపింది. ఇంకా పరిషత్ ఎన్నికలే బ్యాలెన్స్ ఉన్నాయి. పంచాయతీల్లో తమ మద్దతుదారులు 85 శాతానికి పైగా...

CM Jagan: సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. పెరిగిన వైసీపీ ఓటు బ్యాంక్.. రాష్ట్రవ్యాప్తంగా అదే జగన్ వేవ్
Cm Jagan
Ram Naramaneni
|

Updated on: Mar 14, 2021 | 6:17 PM

Share

రోజుల వ్యవధిలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దుమ్ము రేపింది. ఇంకా పరిషత్ ఎన్నికలే బ్యాలెన్స్ ఉన్నాయి. పంచాయతీల్లో తమ మద్దతుదారులు 85 శాతానికి పైగా గెలిచారని వైసీపీ నేతలు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచి.. వైసీపీ జండా కప్పుకున్న నాయకుల ఫోటోల వివరాలను వెబ్ సైట్‌లో పెట్టారు. పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే… మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచింది.. కార్పోరేషన్లను క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపాలిటీల్లోనూ మైదుకూరు, తాటిపత్రి తప్ప మిగతా వాటన్నింటినీ సొంతం చేసుకుంది. అక్కడ ఇప్పుడు క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో సగానికిపైగా ఓటర్లు ఓటు వేశారు.

2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. వైసీపీ ఓటు బ్యాంక్ పెరిగినట్లు స్పష్టం అవుతోంది. పంచాయతీల్లో పార్టీ సింబల్ లేకున్నా.. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తు మీదనే జరిగాయి. రాష్ట్రంలో 3.94 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 3.14 కోట్లమంది ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 51 శాతం ఓట్లతో 80 శాతం సీట్లను గెలుచుకుంది. ఎన్నికలు ముగిసి ఎడాదిన్నర తర్వాత వైసీపీ మీ పాజిటివ్ ఓటు పెరిగిందనే విషయం స్పష్టం చేస్తున్నాయి తాజా ఫలితాలు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో కలిపి 77.16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీలలో 71 శాతం కార్పోరేషన్లలో 60 శాతం ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో వైసీపీ 90 శాతానికి పైగా సీట్లు సాధించింది. సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి.

సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ఓటు బ్యాంక్ తగ్గలేదు. పైగా అంతో ఇంతో పెరిగింది. టీడీపీకి వచ్చిన సీట్లు చూస్తే.. ఆ పార్టీకి ఓటు బ్యాంక్‌ సూచనలు ఏవీ కనిపించడం లేదు. టీడీపీ పోరాడిన అమరావతి ప్రాంతంతో పాటు పార్టీ ప్రముఖులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ సీట్లు గెలిచిన నగరాల్లోనూ సైకిలుకు సానుకూల ఫలితాలు రాలేదు. రాష్ట్రంలో పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్లతో సగం మందికి పైగా ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్న సీట్లు ఆ పార్టీ బలం పెరుగుతున్న తీరుకు నిదర్శనం.

Also Read:

Hindupur municipality: బాలయ్యకు చెక్.. హిందూపురంలో వైసీపీ ఏకపక్ష విజయం

Tadipatri Municipality: ఊరి మంచి కోసం జగన్‌ను కలిసేందుకు సిద్దం.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్