AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారం రోజుల పరిధిలో రెండు చిరుతలు మృతి.. అటవీ శాఖ అప్రమత్తం..

కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలోని జాలిమంచి, ఆదోని రణ మండల, కొండ ఎల్లమ్మ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తోందని గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు. గ్రామ శివారు ప్రాంతంలో చిరుత పులి ఆనవాలు సేకరించి పరిశీలిస్తున్నారు. ఆదోని, కోసిగి మండలాల్లో చిరుత పులి కనిపించిన దాఖలాలు ఉన్నాయంటున్నారు స్థానికులు.

వారం రోజుల పరిధిలో రెండు చిరుతలు మృతి.. అటవీ శాఖ అప్రమత్తం..
Tiger Dies In Kurnool Distr
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Mar 21, 2024 | 8:35 AM

Share

కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలోని జాలిమంచి, ఆదోని రణ మండల, కొండ ఎల్లమ్మ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తోందని గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు. గ్రామ శివారు ప్రాంతంలో చిరుత పులి ఆనవాలు సేకరించి పరిశీలిస్తున్నారు. ఆదోని, కోసిగి మండలాల్లో చిరుత పులి కనిపించిన దాఖలాలు ఉన్నాయంటున్నారు స్థానికులు. కొద్దిరోజుల క్రితం ఎమ్మిగనూరు రహదారిలో వాహనం ఢీ కొట్టి చిరుత పులి మృతి చెందింది. అది మరవక ముందే కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలో అనుమానాస్పద స్థితిలో మరోచిరుత మృతి చెందడం కలవరపెడుతోంది.

మృతి చెందిన చిరుతను చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు రైతులు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని సలకలకొండ గ్రామ పొలాల్లో బుధవారం అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి చెందింది. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని చిరుత మృతిపై దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారా అనే కోణంలో ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లేక ఎండాకాలం కావడంతో నీరు అందక మృతి చెందిందా అనే విషయం తెలియాల్సి ఉంది. మృతి చెందిన చిరుత పులి పోస్టుమార్టం రిపోర్టు వస్తే మృతికి గల కారణాలు వెలుగులోకి వస్తాయి. ఇటీవల ఎమ్మిగనూరు సమీపంలో దారుణం చోటుచేసుకుంది. NH167 రహదారిపై రోడ్ మీద వెళ్తున్న చిరుత పులిను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో పులి అక్కడికి అక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పులిని పరిశీలించి విచారణ చేపట్టారు. గత కొన్ని రోజుల క్రితం పక్కనే ఉన్న గుడికల్ కొండల్లో సంచరిస్తున్న చిరుతను పట్టుకొని దట్టమైన అడవులకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..