AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరలక్ష్మీ వ్రతం వేళ అమాంతం పెరిగిపోయిన పూల రేట్లు.. కొనలేకపోతున్నామంటూ మహిళల అవేదన.. వివరాలివే..

Andhra Pradesh: శ్రావణ మాస శోభతో పూల మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. దీంతో పూల ధరలకు రెక్కాలొచ్చాయి. భారీగా పెరిగిన ధరలతో కొనుగోలు దారులు ఇబ్బంది పడుతున్నారు. శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతంతో బెజవాడలోని పూల మార్కెట్ రద్దీగా మారింది. కొనుగోలుదారులతో విజయవాడలోని పూల మార్కెట్లు అన్ని కిక్కిరిసి పోయాయి. సీజన్ కావటం అందులోనూ శ్రావణ మాసం..

వరలక్ష్మీ వ్రతం వేళ అమాంతం పెరిగిపోయిన పూల రేట్లు.. కొనలేకపోతున్నామంటూ మహిళల అవేదన.. వివరాలివే..
Varalakshmi Vratham; Flower Prices
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 25, 2023 | 6:15 AM

Share

ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 25: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా శ్రావణ మాసం శోభే కనిపిస్తోంది. పైగా ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో ఆ కల మరింతగా కనిపిస్తోంది. ముఖ్యంగా మార్కెట్లు అన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. పూలు, పండ్లకు విపరీతమైన గిరాకీ పెరిగింది.. దీంతో రేట్లు సైతం రెట్టింపు అవుతున్నాయి. శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతంతో బెజవాడలోని పూల మార్కెట్ రద్దీగా మారింది. కొనుగోలుదారులతో విజయవాడలోని పూల మార్కెట్లు అన్ని కిక్కిరిసి పోయాయి. సీజన్ కావటం అందులోనూ శ్రావణ మాసం కావడంతో పూల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఏ పూలు కొనాలన్నా పావు కిలో ధర రూపాయల 100 పై మాటే. పావు కిలో చామంతి ,గులాబీ ఏదైనా 100 రూపాయల పైనే.. ఇక కేజీ పువ్వులు కొనాలంటే 400 రూపాయలు..

అలాగే సన్న జాజులు, కనకాంబరం అయితే కేజీ 600 రూపాయలు ఉన్నాయి. రెండు రోజుల ముందు వరకు కూడా 20 -30 రూపాయలు ఉన్న ధరలు ఒక్కసారిగా పెంచేశారు వ్యాపారులు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శ్రావణమాస శోభతో పూల మార్కెట్లన్నీ కలకలాడుతూన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలోని కిలో చామంతి పూల ధర 400వందలు పలుకుతున్నాయి. దీంతో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలు అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. కడియం హోల్సేల్ పూల మార్కెట్లకు భారీగా ఎగుమతులు జరగడంతో బహిరంగ మార్కెట్లో చామంతి , బొండు గులాబీ 500 వరకు పలుకుతుంది.

అయితే గత రెండు నెలలుగా అధిక ఆషాడం కావడంతో ధరలు లేక నష్టాలు చూశారు పూల వ్యాపారులు. శ్రావణ మాసం సందర్భంగా ధరలు కొన్ని రోజులు నిలకడగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. బహిరంగ మార్కెట్లో పూలకు అధిక రేటు ఉండడంతో 10 , 20 రూపాయలు లాభాలకు మాత్రమే అమ్ముకోవాల్సి వస్తుందని రాజమండ్రి జాంపేట పూల వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు అధిక ధరలతో పూలు కొనుగోలు చేయలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..