AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flexi War in AP: నంద్యాలలో జనసేనానికి వ్యతిరేకంగా ప్లెక్సీలు..అధికారులకు ఫిర్యాదు చేసిన జనసైనికులు

వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పక్కన జనసేన నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాక్షస పాలనకు అంతం.. ప్రజా పాలనకు ఆరంభం అనే నినాదంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే జనసేన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. దీంతో పోలీసులకు జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Flexi War in AP: నంద్యాలలో జనసేనానికి వ్యతిరేకంగా ప్లెక్సీలు..అధికారులకు ఫిర్యాదు చేసిన జనసైనికులు
Jsp Vs Ycp
Surya Kala
|

Updated on: Jun 03, 2023 | 6:28 AM

Share

జనసేన, వైసీపీ మధ్య ఫ్లెక్సీ యుద్ధం ముదురుతోంది. పోటాపోటీ పోస్టర్లతో రోజుకో ప్రాంతంలో గొడవ జరుగుతోంది. కైకలూరులో ఫ్లెక్సీల రగడ కొనసాగుతుండగానే.. నంద్యాలలో పవన్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు కనిపించాయి. వైసీపీ పోస్టర్లను పట్టించుకోకుండా, తమ ఫ్లెక్సీలను పోలీసులు తీసేయడం ఏంటని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే పార్టీల మధ్య యుద్దం మొదలైంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీవార్‌ నడుస్తోంది. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సీన్‌ కొనసాగుతోంది. వైసీపీ వర్సెస్ జనసేనగా నడుస్తోంది ఫ్లెక్సీవార్‌. జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. భీమవరంలో వివాదం సద్దుమణగక ముందే ఏలూరు జిల్లా కైకలూరులో ఫ్లెక్సీల రగడ మొదలైంది. కైకలూరు తాలూకా సెంటర్లో వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పక్కన జనసేన నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాక్షస పాలనకు అంతం.. ప్రజా పాలనకు ఆరంభం అనే నినాదంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే జనసేన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. దీంతో పోలీసులకు జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇక అటూ కర్నూలు జిల్లా నంద్యాలలో పలు సెంటర్లలో ప్లెక్సీలు కలకలం సృష్టించాయి. జనసేనానికి వ్యతిరేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పవన్‌కు వ్యతిరేకంగా వెలసిన ఈ ప్లెక్సీలపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లెక్సీలపై అభ్యంతరం తెలుపుతూ… డీఎస్సీ, మున్సిపల్ కమీషనర్‌కు వినతి పత్రాలు అందజేవారు. ప్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు జనసేన నాయకులు. మొత్తంగా ఒక పార్టీ పై మరో పార్టీ వ్యంగాస్త్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం వివాదానికి కారణం అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..