AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti Rush: వామ్మో.. ఏపీకి బస్సు, విమాన టికెట్ ధరలు ఎంతున్నాయో తెలుసా.?

పండగ రష్ మొదలయింది. హైదరాబాద్ నుంచి సొంతూర్లకు బయలుదేరారు ఏపీ జనం. దీంతో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్‌లో జనాలు కిక్కిరిసిపోతున్నారు. ఇదే అదును అని భావించి.. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడికి దిగాయి. ప్రయాణీకుల నుంచి వీలైనంత గుంజేస్తున్నారు. అటు ఫ్లైట్ చార్జీలు కూడా బాగా పెరిగాయి.

Sankranti Rush: వామ్మో.. ఏపీకి బస్సు, విమాన టికెట్ ధరలు ఎంతున్నాయో తెలుసా.?
Sankranti Rush
Ram Naramaneni
|

Updated on: Jan 10, 2025 | 11:16 AM

Share

సంక్రాంతి సీజన్‌ అంటే.. అందరికీ పండగే. సామాన్యులకు భక్తి.. వ్యాపారులకు మాత్రం భుక్తి. జనాలను దోచుకోడానికి అనుకూలించే పర్ఫెక్ట్‌ సీజన్‌ ఇది. పండక్కి జనం ఇంటికి వెళ్లి కుటుంబాలతో పాటు ఎంజాయ్‌ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇందుకోసం ప్రజలు ఎలాగైనా గమ్యం చేరుకునే ప్రయత్నాలు చేస్తారు. బస్సుల్లోనో.. రైళ్లలోనో.. ఫ్లైట్స్‌ బుక్‌ చేసుకునో.. క్యాబ్‌లు మాట్లాడుకోనో.. వెళ్తుంటారు. ఇదే అదనుగా ప్రైవేట్‌ వాహనదారులు, ట్రావెల్స్‌ ఏజన్సీలు పండగ బాదుడుకి తెరతీశాయి. టికెట్‌ రేట్లు భారీగా పెంచేస్తున్నాయి. సాధారంగా వెయ్యిరూపాయలు ఉండే టికెట్‌ ధర రెండింతలు పెంచేసేశారు ట్రావెల్స్‌ బస్సుల వ్యాపారులు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లాలంటే వెయ్యి లోపే ఖర్చయ్యే చోట 1500 నుంచి 2500 వరకు పెట్టాల్సి వస్తోంది. పండగంతా గోదావరి జిల్లాల్లోనే కనిపిస్తుంది. అక్కడకు స్థానికులే కాదు.. తెలుగు రాష్ట్రాల నుంచి చాలమంది సంక్రాంతికి వెళ్తుంటారు. దీంతో రాజమండ్రి టికెట్‌ హైదరాబాద్‌ నుంచి 1500ని మించదు కాని.. ఈసారి స్లీపర్‌ 4వేల రూపాయలుగా పెట్టేశారు. ఈ దోపిడీ ఏంటని ప్రయాణీకులు తలలు పట్టుకుంటున్నారు. నాన్‌ ఏసీ అయితే 2వేలు ఉంది. వైజాగ్‌కు ఆర్టీసీ బస్సులో 2వేల రూపాయల లోపే టికెట్‌ ఉంటే.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు 3వేల నుంచి 5500 వరకు వసూలు చేస్తున్నాయి. స్లీపర్‌ అయితే 6వేల వరకు ఉంటున్నాయి.

రైళ్లలో రద్దీ మామూలగా లేదు. రెండు మూడు రాష్ట్రాల్లో పండగ ఉండడంతో రైళ్లు రద్దీగా ఉన్నాయి. అంతేకాదు లేటుగా నడుస్తుండడం కూడా ప్రయాణికులపై ఎఫెక్ట్‌ పడుతోంది. దీంతో ఫ్లైట్లను ఆశ్రయిస్తున్నారు చాలా మంది ప్రయాణికులు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం, రాజమండ్రి, వైజాగ్‌కు వెళ్లేందుకు జనం ఎగబడుతుండడంతో ఇదే అదనుగా.. పలు కంపెనీలు చార్జీలు పెంచేశాయి. రాజమండ్రి వెళ్లాలంటే 12 వేల నుంచి 15వేల వరకు టికెట్‌ కనిపిస్తోంది. వైజాగ్‌ టికెట్‌ కొనాలంటే 15వేలకు తగ్గడంలేదు. దీంతో జనం పండగ చేసుకునేందుకు దాచుకున్న సొమ్మంతా.. నిలువు దోపిడీ చేస్తున్నాయి ట్రావెల్స్‌ కంపెనీలు. ఇక క్యాబ్‌లో వెళదామన్నా పండగ రష్‌ను క్యాష్‌ చేసుకుంటున్నారు. ఇంటికెళ్లే దారేది అన్నట్లు తల పట్టుకుంటున్నాడు సామాన్యుడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో