AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఈమె గుర్తున్నారా.. ఇప్పుడు తన ఇంట్లో పెంచిన అరటి చెట్టు కారణంగా వార్తల్లోకి

నన్నపనేని రాజకుమారి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఫేమస్ వ్యక్తి.. అన్న ఎన్టీఆర్ టైం నుంచి ఆమె రాజకీయాల్లో ఉన్నారు. అటు టీడీపీ, కాంగ్రెస్‌ల హయాంలలో కీలక పదవుల్లో కొనసాగారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ.. కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే పెరట్లోని ఓ అరటి మొక్క ఇప్పుడు ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది.

Andhra: ఈమె గుర్తున్నారా.. ఇప్పుడు తన ఇంట్లో పెంచిన అరటి చెట్టు కారణంగా వార్తల్లోకి
Banana Tree
T Nagaraju
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 29, 2025 | 6:48 PM

Share

నన్నపనేని రాజకుమారి… రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు… ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా,  ఉమెన్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా  పనిచేసి రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే వయసు సహకరించకపోవడంతో..  ఆమె ప్రస్తుతం రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాజకుమారి ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

రాజకుమారి కట్టు, బొట్టు ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రత్యేక ఆహార్యంతో ఆమె గుర్తింపు పొందారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రాజకుమారి తన సొంత గార్డెన్‌లో వివిధ రకాల పూల, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ‌ఇందులో భాగంగా నాదేండ్ అరటి మొక్కలకు నాటారు. అయితే ఈ మధ్య కాలంలో కాపుకొచ్చిన అరటి.. గెల వేసింది. అయితే ఈ గెల అసాధారణ స్థాయిలో ఉంది. సాధారణంగా నాదేండ్ చెట్టుకి వచ్చే అరటి గెలకు నాలుగైదు హస్తాలకు మించి ఉండవు. అలాగే‌ అరటి కాయలు కూడా యాభై అరవైకి మించవు. కాని ఇక్కడ వచ్చిన గెలకు ఏకంగా పదిహేను హస్తాలున్నాయి. కాయలు కూడా 150 వరకూ ఉన్నాయి. దీంతో ఆ అరటి గెలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

రాజకుమారి మాత్రం పూర్తిగా ఆర్గానిక్ విధానంలో అరటి  మొక్కను పెంచినట్లు చెప్పారు. రసాయన ఎరువులు ఉపయోగించడం లేదన్నారు. మొక్క బలంగా పెరగడానికి సాధారణ ఎరువులనే వేసినట్లు చెప్పారు. తమ ఇంటిలో అరటి గెలకు పదిహేను హస్తాలు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంటికి వచ్చిన వారు కూడా అరటి చెట్టును ఆసక్తిగా తిలకిస్తున్నట్లు చెప్పారు. కాసిన అరటి పండ్లు రుచిగా కూడా ఉంటాయన్నారు. కాయలు మాగి పండు అయ్యే వరకూ చెట్టుకే ఉంచుతామని దీంతో మంచి రుచి వస్తుందని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?