Visakapatnam: విశాఖ మన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జ్వరాలు.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనాలు..

Visakhapatnam: విశాఖ మన్యాన్ని డెంగ్యూ జ్వరం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా కాస్త ఊరటనిచ్చిందనుకునే లోపే డెంగ్యూ జ్వరం మన్యం వాసులకు..

Visakapatnam: విశాఖ మన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జ్వరాలు.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనాలు..
Visakha
Follow us

|

Updated on: Aug 22, 2021 | 12:07 PM

Visakhapatnam: విశాఖ మన్యాన్ని డెంగ్యూ జ్వరం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా కాస్త ఊరటనిచ్చిందనుకునే లోపే డెంగ్యూ జ్వరం మన్యం వాసులకు భతపెడుతోంది. డెంగ్యూ తో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ ఆకస్మికంగా మృతిచెందడం.. అడవిబిడ్డల్లో మరింత ఆందోళన రేపుతోంది. మన్యం ప్రాంతంలోని కొయ్యూరు మండలం శరభన్నపాలేనికి చెందిన లోకుల గాంధీ డెంగ్యూతో కేజీహెచ్ లో చేరి ప్రాణాలు కోల్పోయారు.

కాగా, విశాఖ ఏజెన్సీలో ప్రజలు డెంగ్యూతో ఒక్కొక్కరుగా ఆసుపత్రిలో చేరుతున్నారు. జ్వరం, ఒళ్ళునొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏజెన్సీ వ్యాప్తంగా ఇప్పటివరకు 13 కేసులు నమోదైనా అనధికారికంగా జ్వర పీడితులు ఎక్కువమందే ఉన్నారు. ఏజెన్సీలో 11 మండలాలున్నాయి. ఆరున్నర లక్షల జనాభా. చాలా చోట్ల విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి. వర్షాలు కురుస్తుండడం, నీరు కలుషితమవడానికి తోడు దోమల బెడద ఈ సీజన్ లో పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల సంఖ్య పెరుగుతోంది.

విశాఖ మన్యంలో ఇప్పటివరకు 13 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇది అధికారికంగా మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుందనేది జనం మాట. ఒక్క పాడేరులోనే 8 వరకు కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా చాలా చోట్ల గిరిజన గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరాలతో మంచం పట్టారు. అయితే.. నిజంగానే డెంగ్యూ జ్వరమా..? లేక మలేరియానా..? కరోనా జ్వరమా అన్నది తేల్చుకోలేక ఆందోళన చెందుతున్నారు జనాలు. భయంతో చాలామంది మైదాన ప్రాంతానికి తరలివెళ్తున్నారు. ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

వాస్తవానికి జ్వరాల తీవ్రత పెరిగినా.. ఆసుపత్రులకు బాధితులు క్యూ కడుతున్నా డెంగ్యూ నిర్ధారణ కావడం లేదు. కచ్చితంగా డెంగ్యూ నిర్ధారణ కావాలంటే కేజీహెచ్ ల్యాబ్ లోనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అక్కడ తప్ప.. మరెక్కడా జిల్లాలో డెంగ్యూ నిర్ధారణ కేంద్ర గానీ, ల్యాబ్ గానీ లేదు. దీన్ని క్యాష్ చేసుకుంటున్న కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్.. జ్వరాలతో చేరుతున్న వారిని భయపెట్టి డబ్బులు గుంజేస్తున్నారు.

అయితే, ఏజెన్సీలో 13 కేసులే నమోదైనా.. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి. 80కి పైగా కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తీవ్రత పెరిగి ప్రాణాంతకంగా మారి మరింత మంది ప్రాణాలు హరించకముందే అధికారులు మేల్కొని నివారణా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also read:

Corona Spread: కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న ప్లాస్టిక్ షీల్డ్స్ కరోనా వ్యాప్తిని ఆపడం కష్టం అంటున్న శాస్త్రవేత్తలు.. ఎందుకంటే..

Nadiya: తెలుగు తెర అందాల అత్తకు కోవిడ్ పాజిటివ్.. వ్యాక్సిన్ తీసుకున్నా వదలని మహమ్మారి..

తాలిబన్ల భయానికి దేశం వదిలిపారిపోతున్న ఆఫ్ఘాన్ ప్రజలు.. ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధపడ్డ దేశాలు ఇవే..

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..